మున్సిపల్ ఎన్నికల్లో నియమావళికి తూట్లు పొడిస్తే చర్యలు ప్రభుత్వ ఉద్యోగులకు జిల్లా కలెక్టర్
మున్సిపల్ ఎన్నికల్లో నియమావళికి తూట్లు పొడిస్తే చర్యలు ప్రభుత్వ ఉద్యోగులకు జిల్లా కలెక్టర్
స్థానికం బృందం
మున్సిపల్ ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు ఎన్నికల నియమావళిని కట్టుదిట్టంగా అమలు చేస్తామని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు స్పష్టం చేశారు.ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే బయటి సేవల సిబ్బంది, ఒప్పంద ఉద్యోగులు, వనరుల వ్యక్తులు మున్సిపల్ ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలకు లేదా అభ్యర్థుల తరఫున ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనరాదని తేల్చిచెప్పారు. ప్రచారంలో తిరగడం, రాజకీయ సభలు, ర్యాలీలు, కార్యక్రమాల్లో పాల్గొనడం ఎన్నికల నిబంధనలకు విరుద్ధమని పేర్కొన్నారు.
ఇలాంటి ఉల్లంఘనలు గుర్తించినట్లయితే సంబంధిత ఉద్యోగులపై ఎన్నికల నియమావళి ప్రకారం క్రమశిక్షణ చర్యలతో పాటు చట్టపరమైన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ హెచ్చరించారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు అధికార యంత్రాంగం సమిష్టిగా బాధ్యత వహించాలని కోరారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి