మున్సిపల్ ఎన్నికల్లో నిర్లక్ష్యానికి తావు లేదు – అదనపు కలెక్టర్ భాస్కర్ రావు
మున్సిపల్ ఎన్నికల్లో నిర్లక్ష్యానికి తావు లేదు – అదనపు కలెక్టర్ భాస్కర్ రావు
స్థానికం బృందం
రెండవ సాధారణ మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో ఏ చిన్న నిర్లక్ష్యానికీ తావు లేకుండా పూర్తి బాధ్యతతో విధులు నిర్వహించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు అధికారులను ఆదేశించారు.శుక్రవారం మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లలో భాగంగా మోత్కూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారుల శిక్షణ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారుల పాత్ర అత్యంత కీలకమని స్పష్టం చేశారు. పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు సజావుగా సాగేలా చూసే ప్రధాన బాధ్యత ప్రిసైడింగ్ అధికారులదేనన్నారు.
పోలింగ్కు సంబంధించిన ప్రతి సామగ్రిని క్షుణ్ణంగా పరిశీలించాలని, బ్యాలెట్ పత్రాలు, పోలింగ్ పెట్టెలను ఒకటికి రెండుసార్లు పరిశీలించుకోవాలని సూచించారు. ముఖ్యంగా పోలింగ్ పెట్టె తెరవడం, ముద్ర వేయడం వంటి ప్రక్రియల్లో అత్యంత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.పోలింగ్ కేంద్రాలకు వచ్చే ఓటర్లకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని తెలిపారు. ఎన్నికల ప్రక్రియ మొత్తం నిష్పక్షపాతంగా, నిక్షేపంగా సాగాలని స్పష్టం చేశారు.ఈ శిక్షణ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్, తహసిల్దార్, ప్రిసైడింగ్ అధికారులు, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి