Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 04:38 AM

మున్సిపల్ ఎన్నికల్లో నిర్లక్ష్యానికి తావు లేదు – అదనపు కలెక్టర్ భాస్కర్ రావు

మున్సిపల్ ఎన్నికల్లో నిర్లక్ష్యానికి తావు లేదు – అదనపు కలెక్టర్ భాస్కర్ రావు

మున్సిపల్ ఎన్నికల్లో నిర్లక్ష్యానికి తావు లేదు – అదనపు కలెక్టర్ భాస్కర్ రావు
February 06, 2026 03:47 PM 22 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రెండవ సాధారణ మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో ఏ చిన్న నిర్లక్ష్యానికీ తావు లేకుండా పూర్తి బాధ్యతతో విధులు నిర్వహించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు అధికారులను ఆదేశించారు.శుక్రవారం మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లలో భాగంగా మోత్కూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారుల శిక్షణ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారుల పాత్ర అత్యంత కీలకమని స్పష్టం చేశారు. పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు సజావుగా సాగేలా చూసే ప్రధాన బాధ్యత ప్రిసైడింగ్ అధికారులదేనన్నారు.

పోలింగ్‌కు సంబంధించిన ప్రతి సామగ్రిని క్షుణ్ణంగా పరిశీలించాలని, బ్యాలెట్ పత్రాలు, పోలింగ్ పెట్టెలను ఒకటికి రెండుసార్లు పరిశీలించుకోవాలని సూచించారు. ముఖ్యంగా పోలింగ్ పెట్టె తెరవడం, ముద్ర వేయడం వంటి ప్రక్రియల్లో అత్యంత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.పోలింగ్ కేంద్రాలకు వచ్చే ఓటర్లకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని తెలిపారు. ఎన్నికల ప్రక్రియ మొత్తం నిష్పక్షపాతంగా, నిక్షేపంగా సాగాలని స్పష్టం చేశారు.ఈ శిక్షణ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్, తహసిల్దార్, ప్రిసైడింగ్ అధికారులు, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News