Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
హోమియో ఆయుష్ డే సందర్భంగా యోగ అవగాహన కార్యక్రమం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 01:24 PM

మున్సిపల్ ఎన్నికల్లో నిర్లక్ష్యానికి తావు లేదు – అదనపు కలెక్టర్ భాస్కర్ రావు

మున్సిపల్ ఎన్నికల్లో నిర్లక్ష్యానికి తావు లేదు – అదనపు కలెక్టర్ భాస్కర్ రావు

మున్సిపల్ ఎన్నికల్లో నిర్లక్ష్యానికి తావు లేదు – అదనపు కలెక్టర్ భాస్కర్ రావు
February 06, 2026 03:47 PM 20 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రెండవ సాధారణ మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో ఏ చిన్న నిర్లక్ష్యానికీ తావు లేకుండా పూర్తి బాధ్యతతో విధులు నిర్వహించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు అధికారులను ఆదేశించారు.శుక్రవారం మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లలో భాగంగా మోత్కూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారుల శిక్షణ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారుల పాత్ర అత్యంత కీలకమని స్పష్టం చేశారు. పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు సజావుగా సాగేలా చూసే ప్రధాన బాధ్యత ప్రిసైడింగ్ అధికారులదేనన్నారు.

పోలింగ్‌కు సంబంధించిన ప్రతి సామగ్రిని క్షుణ్ణంగా పరిశీలించాలని, బ్యాలెట్ పత్రాలు, పోలింగ్ పెట్టెలను ఒకటికి రెండుసార్లు పరిశీలించుకోవాలని సూచించారు. ముఖ్యంగా పోలింగ్ పెట్టె తెరవడం, ముద్ర వేయడం వంటి ప్రక్రియల్లో అత్యంత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.పోలింగ్ కేంద్రాలకు వచ్చే ఓటర్లకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని తెలిపారు. ఎన్నికల ప్రక్రియ మొత్తం నిష్పక్షపాతంగా, నిక్షేపంగా సాగాలని స్పష్టం చేశారు.ఈ శిక్షణ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్, తహసిల్దార్, ప్రిసైడింగ్ అధికారులు, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News