Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: February 23, 2026 11:46 PM

మున్సిపల్ ఎన్నికల్లో బీసీ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలి

మున్సిపల్ ఎన్నికల్లో బీసీ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలి

మున్సిపల్ ఎన్నికల్లో బీసీ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలి
February 06, 2026 06:20 AM 121 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
స్థానికం బృందం

ఎస్‌ఎస్‌పీజీకేఎస్ జిల్లా అధ్యక్షుడు పరిటాల రవి గౌడ్ పిలుపు

యాదాద్రి భువనగిరి జిల్లా: మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న బీసీ అభ్యర్థులందరినీ అత్యధిక మెజారిటీతో గెలిపించాలంటూ బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు గాజుల శ్రీనివాస్ గౌడ్‌ను, యాదాద్రి భువనగిరి జిల్లా సర్దార్ సర్వాయి పాపన్న గీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు పరిటాల రవి కుమార్ గౌడ్ కోరారు.ఈ సందర్భంగా పరిటాల రవి కుమార్ గౌడ్ మాట్లాడుతూ, బీసీ వర్గాల్లో ఐక్యతను మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తామని, ప్రతి బీసీ బిడ్డను ఈ మున్సిపల్ ఎన్నికల్లో గెలిపించుకునేలా సమిష్టిగా ముందుకు సాగుతామని తెలిపారు. బీసీల హక్కులు, సంక్షేమం కోసం సంఘటితంగా పనిచేస్తూ, ప్రచారంలో చురుగ్గా పాల్గొని ఎక్కువ సీట్లు సాధించడమే లక్ష్యమని స్పష్టం చేశారు.బీసీ అభ్యర్థుల విజయమే సామాజిక న్యాయానికి బలమైన అడుగని, ఈ ఎన్నికలు బీసీల రాజకీయ శక్తిని నిరూపించే వేదికగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News