Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 01:33 PM

మున్సిపల్ ఎన్నికల్లో 48 గంటల నిబంధన తప్పనిసరి. కలెక్టర్ హనుమంతరావు

మున్సిపల్ ఎన్నికల్లో 48 గంటల నిబంధన తప్పనిసరి. కలెక్టర్ హనుమంతరావు

మున్సిపల్ ఎన్నికల్లో 48 గంటల నిబంధన తప్పనిసరి. కలెక్టర్ హనుమంతరావు
05-02-2026 89 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రెండో సాధారణ మున్సిపల్ ఎన్నికలలో భాగంగా ఈ నెల 11వ తేదీన జరగనున్న పోలింగ్‌ను దృష్టిలో ఉంచుకొని, పోటీలో ఉన్న అభ్యర్థులు, రాజకీయ పార్టీలన్నీ 48 గంటల నిబంధనను కచ్చితంగా పాటించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హనుమంత రావు స్పష్టం చేశారు.పోలింగ్ ముగిసే ముందు 48 గంటల వ్యవధిలో ఎలాంటి ఎన్నికల ప్రచారం సాగకూడదని తెలిపారు. సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించడమే కాకుండా ప్రచార సంబంధిత విషయాలను ఎలాంటి మాధ్యమాల ద్వారా కూడా కొనసాగించరాదని పేర్కొన్నారు.

నిబంధనలను ఉల్లంఘించిన వారిపై తెలంగాణ మున్సిపాలిటీ చట్టం–2019లోని సెక్షన్ 209 ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పోలింగ్ కేంద్రాల సమీపంలో ఓటర్లను ప్రభావితం చేసేలా ఎలాంటి కార్యకలాపాలు చేపట్టరాదని తెలిపారు.స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత, పారదర్శక ఎన్నికల నిర్వహణకు రాజకీయ పార్టీలు, పోటీలో ఉన్న అభ్యర్థులు, మాధ్యమాల యాజమాన్యాలు సహకరించాలని కలెక్టర్ కోరారు. 48 గంటల నిబంధనను అందరూ తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు.

Sthanikam

మున్సిపల్ ఎన్నికల్లో 48 గంటల నిబంధన తప్పనిసరి. కలెక్టర్ హనుమంతరావు

Article Image

రెండో సాధారణ మున్సిపల్ ఎన్నికలలో భాగంగా ఈ నెల 11వ తేదీన జరగనున్న పోలింగ్‌ను దృష్టిలో ఉంచుకొని, పోటీలో ఉన్న అభ్యర్థులు, రాజకీయ పార్టీలన్నీ 48 గంటల నిబంధనను కచ్చితంగా పాటించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హనుమంత రావు స్పష్టం చేశారు.పోలింగ్ ముగిసే ముందు 48 గంటల వ్యవధిలో ఎలాంటి ఎన్నికల ప్రచారం సాగకూడదని తెలిపారు. సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించడమే కాకుండా ప్రచార సంబంధిత విషయాలను ఎలాంటి మాధ్యమాల ద్వారా కూడా కొనసాగించరాదని పేర్కొన్నారు.

నిబంధనలను ఉల్లంఘించిన వారిపై తెలంగాణ మున్సిపాలిటీ చట్టం–2019లోని సెక్షన్ 209 ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పోలింగ్ కేంద్రాల సమీపంలో ఓటర్లను ప్రభావితం చేసేలా ఎలాంటి కార్యకలాపాలు చేపట్టరాదని తెలిపారు.స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత, పారదర్శక ఎన్నికల నిర్వహణకు రాజకీయ పార్టీలు, పోటీలో ఉన్న అభ్యర్థులు, మాధ్యమాల యాజమాన్యాలు సహకరించాలని కలెక్టర్ కోరారు. 48 గంటల నిబంధనను అందరూ తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News