మున్సిపల్ ఎన్నికల్లో 48 గంటల నిబంధన తప్పనిసరి. కలెక్టర్ హనుమంతరావు
మున్సిపల్ ఎన్నికల్లో 48 గంటల నిబంధన తప్పనిసరి. కలెక్టర్ హనుమంతరావు
Editor Desk
రెండో సాధారణ మున్సిపల్ ఎన్నికలలో భాగంగా ఈ నెల 11వ తేదీన జరగనున్న పోలింగ్ను దృష్టిలో ఉంచుకొని, పోటీలో ఉన్న అభ్యర్థులు, రాజకీయ పార్టీలన్నీ 48 గంటల నిబంధనను కచ్చితంగా పాటించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హనుమంత రావు స్పష్టం చేశారు.పోలింగ్ ముగిసే ముందు 48 గంటల వ్యవధిలో ఎలాంటి ఎన్నికల ప్రచారం సాగకూడదని తెలిపారు. సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించడమే కాకుండా ప్రచార సంబంధిత విషయాలను ఎలాంటి మాధ్యమాల ద్వారా కూడా కొనసాగించరాదని పేర్కొన్నారు.
నిబంధనలను ఉల్లంఘించిన వారిపై తెలంగాణ మున్సిపాలిటీ చట్టం–2019లోని సెక్షన్ 209 ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పోలింగ్ కేంద్రాల సమీపంలో ఓటర్లను ప్రభావితం చేసేలా ఎలాంటి కార్యకలాపాలు చేపట్టరాదని తెలిపారు.స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత, పారదర్శక ఎన్నికల నిర్వహణకు రాజకీయ పార్టీలు, పోటీలో ఉన్న అభ్యర్థులు, మాధ్యమాల యాజమాన్యాలు సహకరించాలని కలెక్టర్ కోరారు. 48 గంటల నిబంధనను అందరూ తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి