Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఉద్యోగుల డిమాండ్లపై మహాధర్నా అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 28, 2026 09:38 AM

మున్సిపల్‌ ఎన్నికలకు ఇన్‌చార్జ్‌ల నియామకం.. పార్లమెంట్‌ నియోజకవర్గాలవారీగా మంత్రులకు బాధ్యతలు

మున్సిపల్‌ ఎన్నికలకు ఇన్‌చార్జ్‌ల నియామకం.. పార్లమెంట్‌ నియోజకవర్గాలవారీగా మంత్రులకు బాధ్యతలు

మున్సిపల్‌ ఎన్నికలకు ఇన్‌చార్జ్‌ల నియామకం.. పార్లమెంట్‌ నియోజకవర్గాలవారీగా మంత్రులకు బాధ్యతలు
19-01-2026 350 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

ఉమ్మడి ప్రధాన స్థానికం ప్రతినిధి :మున్సిపల్‌ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల సమన్వయ బాధ్యతలను బలోపేతం చేసే ఉద్దేశంతో పార్లమెంట్‌ నియోజకవర్గాల వారీగా మంత్రులు, సీనియర్‌ నాయకులకు ఇన్‌చార్జ్‌లుగా బాధ్యతలు అప్పగించారు. పార్టీ బలోపేతం, ఎన్నికల వ్యూహ రూపకల్పన, స్థానిక నాయకులతో సమన్వయం వంటి అంశాల్లో ఈ ఇన్‌చార్జ్‌లు కీలక పాత్ర పోషించనున్నారు.ఈ మేరకు ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గానికి సుదర్శన్‌ రెడ్డిని, నిజామాబాద్‌కు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డిని నియమించారు. మల్కాజ్‌గిరి బాధ్యతలను కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి అప్పగించగా, చేవెళ్ల నియోజకవర్గానికి శ్రీధర్‌బాబు ఇన్‌చార్జ్‌గా వ్యవహరించనున్నారు. మెదక్‌కు వివేక్‌, కరీంనగర్‌కు తుమ్మల నాగేశ్వరరావు, పెద్దపల్లికి జూపల్లి కృష్ణారావును బాధ్యతలు అప్పగించారు.అలాగే నల్గొండ నియోజకవర్గానికి అడ్లూరి లక్ష్మణ్‌, భువనగిరికి సీతక్క, వరంగల్‌కు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఇన్‌చార్జ్‌లుగా నియమితులయ్యారు. మహబూబ్‌నగర్‌కు పొన్నం ప్రభాకర్‌తో పాటు దామోదర రాజనర్సింహాకు బాధ్యతలు కేటాయించగా, జహీరాబాద్‌కు అజహరుద్దీన్‌, నాగర్‌కర్నూల్‌కు వాకిటి శ్రీహరి, ఖమ్మం నియోజకవర్గానికి కొండా సురేఖను ఇన్‌చార్జ్‌లుగా ప్రకటించారు.మున్సిపల్‌ ఎన్నికల్లో పార్టీని విజయపథంలో నడిపించేందుకు అనుభవజ్ఞులైన నేతలకు బాధ్యతలు అప్పగించడం ద్వారా క్షేత్రస్థాయిలో బలమైన వ్యూహంతో ముందుకు వెళ్లాలన్నదే సీఎం రేవంత్‌రెడ్డి లక్ష్యంగా తెలుస్తోంది.

Sthanikam

మున్సిపల్‌ ఎన్నికలకు ఇన్‌చార్జ్‌ల నియామకం.. పార్లమెంట్‌ నియోజకవర్గాలవారీగా మంత్రులకు బాధ్యతలు

Article Image

ఉమ్మడి ప్రధాన స్థానికం ప్రతినిధి :మున్సిపల్‌ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల సమన్వయ బాధ్యతలను బలోపేతం చేసే ఉద్దేశంతో పార్లమెంట్‌ నియోజకవర్గాల వారీగా మంత్రులు, సీనియర్‌ నాయకులకు ఇన్‌చార్జ్‌లుగా బాధ్యతలు అప్పగించారు. పార్టీ బలోపేతం, ఎన్నికల వ్యూహ రూపకల్పన, స్థానిక నాయకులతో సమన్వయం వంటి అంశాల్లో ఈ ఇన్‌చార్జ్‌లు కీలక పాత్ర పోషించనున్నారు.ఈ మేరకు ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గానికి సుదర్శన్‌ రెడ్డిని, నిజామాబాద్‌కు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డిని నియమించారు. మల్కాజ్‌గిరి బాధ్యతలను కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి అప్పగించగా, చేవెళ్ల నియోజకవర్గానికి శ్రీధర్‌బాబు ఇన్‌చార్జ్‌గా వ్యవహరించనున్నారు. మెదక్‌కు వివేక్‌, కరీంనగర్‌కు తుమ్మల నాగేశ్వరరావు, పెద్దపల్లికి జూపల్లి కృష్ణారావును బాధ్యతలు అప్పగించారు.అలాగే నల్గొండ నియోజకవర్గానికి అడ్లూరి లక్ష్మణ్‌, భువనగిరికి సీతక్క, వరంగల్‌కు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఇన్‌చార్జ్‌లుగా నియమితులయ్యారు. మహబూబ్‌నగర్‌కు పొన్నం ప్రభాకర్‌తో పాటు దామోదర రాజనర్సింహాకు బాధ్యతలు కేటాయించగా, జహీరాబాద్‌కు అజహరుద్దీన్‌, నాగర్‌కర్నూల్‌కు వాకిటి శ్రీహరి, ఖమ్మం నియోజకవర్గానికి కొండా సురేఖను ఇన్‌చార్జ్‌లుగా ప్రకటించారు.మున్సిపల్‌ ఎన్నికల్లో పార్టీని విజయపథంలో నడిపించేందుకు అనుభవజ్ఞులైన నేతలకు బాధ్యతలు అప్పగించడం ద్వారా క్షేత్రస్థాయిలో బలమైన వ్యూహంతో ముందుకు వెళ్లాలన్నదే సీఎం రేవంత్‌రెడ్డి లక్ష్యంగా తెలుస్తోంది.

మీ స్పందన? 3 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News