Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: February 24, 2026 12:40 AM

మున్సిపల్‌ ఎన్నికలకు ఇన్‌చార్జ్‌ల నియామకం.. పార్లమెంట్‌ నియోజకవర్గాలవారీగా మంత్రులకు బాధ్యతలు

మున్సిపల్‌ ఎన్నికలకు ఇన్‌చార్జ్‌ల నియామకం.. పార్లమెంట్‌ నియోజకవర్గాలవారీగా మంత్రులకు బాధ్యతలు

మున్సిపల్‌ ఎన్నికలకు ఇన్‌చార్జ్‌ల నియామకం.. పార్లమెంట్‌ నియోజకవర్గాలవారీగా మంత్రులకు బాధ్యతలు
January 19, 2026 11:32 AM 332 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sangareddy & Manoor
Sthanikam District Staff Reporter krishna

ఉమ్మడి ప్రధాన స్థానికం ప్రతినిధి :మున్సిపల్‌ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల సమన్వయ బాధ్యతలను బలోపేతం చేసే ఉద్దేశంతో పార్లమెంట్‌ నియోజకవర్గాల వారీగా మంత్రులు, సీనియర్‌ నాయకులకు ఇన్‌చార్జ్‌లుగా బాధ్యతలు అప్పగించారు. పార్టీ బలోపేతం, ఎన్నికల వ్యూహ రూపకల్పన, స్థానిక నాయకులతో సమన్వయం వంటి అంశాల్లో ఈ ఇన్‌చార్జ్‌లు కీలక పాత్ర పోషించనున్నారు.ఈ మేరకు ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గానికి సుదర్శన్‌ రెడ్డిని, నిజామాబాద్‌కు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డిని నియమించారు. మల్కాజ్‌గిరి బాధ్యతలను కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి అప్పగించగా, చేవెళ్ల నియోజకవర్గానికి శ్రీధర్‌బాబు ఇన్‌చార్జ్‌గా వ్యవహరించనున్నారు. మెదక్‌కు వివేక్‌, కరీంనగర్‌కు తుమ్మల నాగేశ్వరరావు, పెద్దపల్లికి జూపల్లి కృష్ణారావును బాధ్యతలు అప్పగించారు.అలాగే నల్గొండ నియోజకవర్గానికి అడ్లూరి లక్ష్మణ్‌, భువనగిరికి సీతక్క, వరంగల్‌కు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఇన్‌చార్జ్‌లుగా నియమితులయ్యారు. మహబూబ్‌నగర్‌కు పొన్నం ప్రభాకర్‌తో పాటు దామోదర రాజనర్సింహాకు బాధ్యతలు కేటాయించగా, జహీరాబాద్‌కు అజహరుద్దీన్‌, నాగర్‌కర్నూల్‌కు వాకిటి శ్రీహరి, ఖమ్మం నియోజకవర్గానికి కొండా సురేఖను ఇన్‌చార్జ్‌లుగా ప్రకటించారు.మున్సిపల్‌ ఎన్నికల్లో పార్టీని విజయపథంలో నడిపించేందుకు అనుభవజ్ఞులైన నేతలకు బాధ్యతలు అప్పగించడం ద్వారా క్షేత్రస్థాయిలో బలమైన వ్యూహంతో ముందుకు వెళ్లాలన్నదే సీఎం రేవంత్‌రెడ్డి లక్ష్యంగా తెలుస్తోంది.

మీ స్పందన? 3 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News