Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక అక్రమ మైనింగ్ ఆరోపణలపై అధికారుల మౌనం ఎందుకు?... హైకోర్టును ఆశ్రయించిన ఆర్టీఐ కార్యకర్త ఉబ్బని రాజు ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 01, 2026 11:27 AM

ముగిసిన పయనం.. మరువలేని జ్ఞాపకం!

ముగిసిన పయనం.. మరువలేని జ్ఞాపకం!

ముగిసిన పయనం.. మరువలేని జ్ఞాపకం!
April 13, 2026 10:48 PM 127 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

ఐరా గ్లోబల్ స్కూల్‌లో ఘనంగా వీడ్కోలు వేడుకలు

​చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని ఐరా గ్లోబల్ స్కూల్‌లో పదవ తరగతి విద్యార్థుల వీడ్కోలు సమావేశం (ఫేర్‌వెల్ పార్టీ) సోమవారం అత్యంత వైభవంగా, ఉద్విగ్నత భరిత వాతావరణంలో జరిగింది. పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఈ వేడుకకు విద్యార్థులు రంగురంగుల దుస్తుల్లో హాజరై సందడి చేశారు. జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో విద్యార్థులు తమ పాఠశాల ప్రయాణంలోని మధుర జ్ఞాపకాలనునెమరువేసుకున్నారు.జూనియర్ విద్యార్థులు తమ సీనియర్ల కోసం ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. విద్యార్థుల నృత్యాలు, పాటలు, నాటికలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సీనియర్ విద్యార్థులకు జూనియర్లు జ్ఞాపికలను అందజేసి వారి భవిష్యత్తు బాగుండాలని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ అరుణ, కరస్పాండెంట్ శ్రీకాంత్ మాట్లాడుతూ.. విద్యార్థులు క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసించి సమాజంలో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని పిలుపునిచ్చారు. పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించి పాఠశాలకు, తల్లిదండ్రులకు కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలని కోరారు. వీడ్కోలు అంటే పయనం ముగియడం కాదని, ఉన్నత లక్ష్యాల వైపు సాగే మరో ప్రయాణానికి ప్రారంభమని విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ రాజశేఖర్ రెడ్డి, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News