ముగిసిన పయనం.. మరువలేని జ్ఞాపకం!
ముగిసిన పయనం.. మరువలేని జ్ఞాపకం!
K.RAVI
ఐరా గ్లోబల్ స్కూల్లో ఘనంగా వీడ్కోలు వేడుకలు
చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని ఐరా గ్లోబల్ స్కూల్లో పదవ తరగతి విద్యార్థుల వీడ్కోలు సమావేశం (ఫేర్వెల్ పార్టీ) సోమవారం అత్యంత వైభవంగా, ఉద్విగ్నత భరిత వాతావరణంలో జరిగింది. పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఈ వేడుకకు విద్యార్థులు రంగురంగుల దుస్తుల్లో హాజరై సందడి చేశారు. జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో విద్యార్థులు తమ పాఠశాల ప్రయాణంలోని మధుర జ్ఞాపకాలనునెమరువేసుకున్నారు.జూనియర్ విద్యార్థులు తమ సీనియర్ల కోసం ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. విద్యార్థుల నృత్యాలు, పాటలు, నాటికలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సీనియర్ విద్యార్థులకు జూనియర్లు జ్ఞాపికలను అందజేసి వారి భవిష్యత్తు బాగుండాలని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ అరుణ, కరస్పాండెంట్ శ్రీకాంత్ మాట్లాడుతూ.. విద్యార్థులు క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసించి సమాజంలో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని పిలుపునిచ్చారు. పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించి పాఠశాలకు, తల్లిదండ్రులకు కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలని కోరారు. వీడ్కోలు అంటే పయనం ముగియడం కాదని, ఉన్నత లక్ష్యాల వైపు సాగే మరో ప్రయాణానికి ప్రారంభమని విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ రాజశేఖర్ రెడ్డి, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి