Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాల్యవివాహాలు చట్టరీత్యా నేరం: సర్పంచ్ శాపాక లింగస్వామి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 06:48 PM

మూడు నెలల రేషన్ బియ్యం ఒకేసారి.. కేంద్ర నిర్ణయం

మూడు నెలల రేషన్ బియ్యం ఒకేసారి.. కేంద్ర నిర్ణయం

మూడు నెలల రేషన్ బియ్యం ఒకేసారి.. కేంద్ర నిర్ణయం
March 04, 2026 08:15 PM 354 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రేషన్ కార్డుదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. రాబోయే వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన బియ్యాన్ని ఏప్రిల్ నెలలోనే ఒకేసారి పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్రాలకు కేంద్ర పౌర సరఫరాల శాఖ లేఖలు పంపింది.

వాతావరణ శాఖ అంచనాల ప్రకారం రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు భారీగా పెరగనున్నాయి. ఎండల తీవ్రతలో లబ్ధిదారులు ఇబ్బంది పడకుండా ముందస్తుగా సరుకులు అందేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

తెలంగాణలో నిల్వలపై చర్చ

దేశంలో తెలంగాణలోనే రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ జరుగుతోంది. ఒక్కో లబ్ధిదారుడికి నెలకు ఆరు కిలోల చొప్పున బియ్యం అందుతోంది. రాష్ట్రంలో కోటికి పైగా ఆహార భద్రత కార్డులు ఉండటంతో, మూడు నెలల కోటా ఒకేసారి ఇవ్వాలంటే భారీగా నిల్వలు అవసరం. దీనిపై అధికారులు సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నారు.

పంపిణీలో సవాళ్లు

గతంలో ఒకేసారి మూడు నెలల కోటా పంపిణీ చేసినప్పుడు లబ్ధిదారులు, డీలర్లు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నిల్వ సౌకర్యాల కొరత, వేలిముద్ర నమోదు ప్రక్రియలో ఆలస్యం వంటి సమస్యలు తలెత్తాయి. ఒక్కో కార్డుకు మూడు సార్లు వేలిముద్ర అవసరం ఉండటం, సర్వర్ సమస్యలతో సమయం ఎక్కువగా పడే అవకాశం ఉంది.

అయితే రవాణా ఖర్చులు తగ్గడం, ఒకేసారి సరఫరా పూర్తవడం వంటి ప్రయోజనాలూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో పంపిణీ ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సి ఉంది.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News