Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 06:33 AM

మృతుడి కుటుంబానికి సర్పంచ్ సాయంగా రూ.10 వేల ఆర్థిక సహాయం

మృతుడి కుటుంబానికి సర్పంచ్ సాయంగా రూ.10 వేల ఆర్థిక సహాయం

మృతుడి కుటుంబానికి సర్పంచ్ సాయంగా రూ.10 వేల ఆర్థిక సహాయం
February 24, 2026 04:09 PM 137 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి జిల్లాలోని రామన్నపేట మండలం పరిధిలోని బోగార గ్రామానికి చెందిన కనుక సత్తయ్య ఇటీవల అకస్మాత్తుగా మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

మృతుడి నివాసానికి చేరుకున్న గ్రామ సర్పంచ్, ప్రథమ పౌరుడు కూనూరు సాయికుమార్ గౌడ్ మృతదేహానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన తరఫున రూ.10 వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. కుటుంబానికి అన్ని విధాల అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు.

గ్రామ ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు ఈ కార్యక్రమంలో పాల్గొని సత్తయ్య కుటుంబానికి సానుభూతి తెలియజేశారు. గ్రామస్థులు కూడా పెద్ద సంఖ్యలో హాజరై మృతుడికి నివాళులర్పించారు.

అకాల మరణంతో కుటుంబం దుఃఖసంద్రంలో మునిగిపోయిందని గ్రామస్తులు తెలిపారు. ఇలాంటి క్లిష్ట సమయంలో ప్రజాప్రతినిధులు అండగా నిలవడం అభినందనీయమని పేర్కొన్నారు.

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News