Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డీఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో పూలే జయంతి కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 12, 2026 12:54 AM

మృతుడి కుటుంబానికి సర్పంచ్ సాయంగా రూ.10 వేల ఆర్థిక సహాయం

మృతుడి కుటుంబానికి సర్పంచ్ సాయంగా రూ.10 వేల ఆర్థిక సహాయం

మృతుడి కుటుంబానికి సర్పంచ్ సాయంగా రూ.10 వేల ఆర్థిక సహాయం
February 24, 2026 04:09 PM 136 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి జిల్లాలోని రామన్నపేట మండలం పరిధిలోని బోగార గ్రామానికి చెందిన కనుక సత్తయ్య ఇటీవల అకస్మాత్తుగా మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

మృతుడి నివాసానికి చేరుకున్న గ్రామ సర్పంచ్, ప్రథమ పౌరుడు కూనూరు సాయికుమార్ గౌడ్ మృతదేహానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన తరఫున రూ.10 వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. కుటుంబానికి అన్ని విధాల అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు.

గ్రామ ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు ఈ కార్యక్రమంలో పాల్గొని సత్తయ్య కుటుంబానికి సానుభూతి తెలియజేశారు. గ్రామస్థులు కూడా పెద్ద సంఖ్యలో హాజరై మృతుడికి నివాళులర్పించారు.

అకాల మరణంతో కుటుంబం దుఃఖసంద్రంలో మునిగిపోయిందని గ్రామస్తులు తెలిపారు. ఇలాంటి క్లిష్ట సమయంలో ప్రజాప్రతినిధులు అండగా నిలవడం అభినందనీయమని పేర్కొన్నారు.

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News