Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కుల వివక్ష ఆరోపణలతో చండూరు పోలీస్ స్టేషన్ ఎదుట కాంగ్రెస్ ధర్నా ఎస్సైపై చర్యలు తీసుకోవాలని డిమాండ్.. తెలంగాణ పోలీసు క్రీడల్లో మూడు విభాగాల్లో కాంస్య పతకాలు సాధించి నల్లగొండ ఖ్యాతిని నిలబెట్టిన షకీర్ మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 02:41 PM

మృతుడి కుటుంబానికి సర్పంచ్ సాయంగా రూ.10 వేల ఆర్థిక సహాయం

మృతుడి కుటుంబానికి సర్పంచ్ సాయంగా రూ.10 వేల ఆర్థిక సహాయం

మృతుడి కుటుంబానికి సర్పంచ్ సాయంగా రూ.10 వేల ఆర్థిక సహాయం
February 24, 2026 04:09 PM 139 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి జిల్లాలోని రామన్నపేట మండలం పరిధిలోని బోగార గ్రామానికి చెందిన కనుక సత్తయ్య ఇటీవల అకస్మాత్తుగా మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

మృతుడి నివాసానికి చేరుకున్న గ్రామ సర్పంచ్, ప్రథమ పౌరుడు కూనూరు సాయికుమార్ గౌడ్ మృతదేహానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన తరఫున రూ.10 వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. కుటుంబానికి అన్ని విధాల అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు.

గ్రామ ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు ఈ కార్యక్రమంలో పాల్గొని సత్తయ్య కుటుంబానికి సానుభూతి తెలియజేశారు. గ్రామస్థులు కూడా పెద్ద సంఖ్యలో హాజరై మృతుడికి నివాళులర్పించారు.

అకాల మరణంతో కుటుంబం దుఃఖసంద్రంలో మునిగిపోయిందని గ్రామస్తులు తెలిపారు. ఇలాంటి క్లిష్ట సమయంలో ప్రజాప్రతినిధులు అండగా నిలవడం అభినందనీయమని పేర్కొన్నారు.

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News