Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అన్నకు రాఖీ కట్టేందుకు వచ్చి.. కుమారుడిని కోల్పోయిన తల్లి! అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 29, 2026 05:08 PM

మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పానగల్ ఆలయాల్లో ప్రత్యేక పూజలు… యునెస్కో గుర్తింపుపై గట్టి డిమాండ్

మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పానగల్ ఆలయాల్లో ప్రత్యేక పూజలు… యునెస్కో గుర్తింపుపై గట్టి డిమాండ్

మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పానగల్ ఆలయాల్లో ప్రత్యేక పూజలు… యునెస్కో గుర్తింపుపై గట్టి డిమాండ్
15-02-2026 89 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

మహాశివరాత్రి పవిత్ర వేళ నల్లగొండ పానగల్ చరిత్ర సాక్షిగా నిలిచింది. శివనామస్మరణతో మార్మోగిన పానగల్ పచ్చల సోమేశ్వరాలయం, అద్భుత శిల్ప వైభవానికి ప్రతీకైన ఛాయా సోమేశ్వరాలయంల్లో ప్రత్యేక పూజలు భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించబడ్డాయి. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి దర్శించుకున్నారు.

ఆలయ ప్రాంగణం అంతా దీపాల కాంతులతో కళకళలాడగా, గంటానాదాలు, రుద్రపారాయణాలు ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని మరింత రెట్టింపు చేశాయి. 11–12వ శతాబ్దాలకు చెందిన ఈ కట్టడాలు కేవలం దేవాలయాలు మాత్రమే కాకుండా తెలంగాణ శిల్ప సంపదకు చిరస్మరణీయ చిహ్నాలుగా నిలిచాయి.

ఛాయా సోమేశ్వరాలయం గర్భగుడిలో ఎప్పటికీ మారని నీడ విశేషం భక్తులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. శిల్పశాస్త్రంలో మన పూర్వీకుల ప్రతిభ ఎంత అపూర్వమో ఈ దేవాలయాలు ప్రతిధ్వనిస్తున్నాయని వ్యాఖ్యానించారు.

ఈ ప్రాచీన ఆలయాలకు యునెస్కో ప్రపంచ వారసత్వ గుర్తింపు తీసుకురావాలని కేంద్రాన్ని కోరుతూ గట్టి స్వరం వినిపించారు. సరైన ప్రణాళిక, పర్యాటక మౌలిక వసతులు కల్పిస్తే పానగల్ ఆలయాలు అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేక స్థానాన్ని సంపాదిస్తాయని స్పష్టం చేశారు.

మహాశివరాత్రి వేళ పానగల్ ఆధ్యాత్మిక జ్వాల మరింత ప్రజ్వలించింది. భక్తి, చరిత్ర, శిల్ప వైభవం కలిసిన ఈ క్షణాలు నల్లగొండకు కొత్త గుర్తింపునిచ్చే సంకేతాలుగా మారాయి.

Sthanikam

మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పానగల్ ఆలయాల్లో ప్రత్యేక పూజలు… యునెస్కో గుర్తింపుపై గట్టి డిమాండ్

Article Image

మహాశివరాత్రి పవిత్ర వేళ నల్లగొండ పానగల్ చరిత్ర సాక్షిగా నిలిచింది. శివనామస్మరణతో మార్మోగిన పానగల్ పచ్చల సోమేశ్వరాలయం, అద్భుత శిల్ప వైభవానికి ప్రతీకైన ఛాయా సోమేశ్వరాలయంల్లో ప్రత్యేక పూజలు భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించబడ్డాయి. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి దర్శించుకున్నారు.

ఆలయ ప్రాంగణం అంతా దీపాల కాంతులతో కళకళలాడగా, గంటానాదాలు, రుద్రపారాయణాలు ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని మరింత రెట్టింపు చేశాయి. 11–12వ శతాబ్దాలకు చెందిన ఈ కట్టడాలు కేవలం దేవాలయాలు మాత్రమే కాకుండా తెలంగాణ శిల్ప సంపదకు చిరస్మరణీయ చిహ్నాలుగా నిలిచాయి.

ఛాయా సోమేశ్వరాలయం గర్భగుడిలో ఎప్పటికీ మారని నీడ విశేషం భక్తులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. శిల్పశాస్త్రంలో మన పూర్వీకుల ప్రతిభ ఎంత అపూర్వమో ఈ దేవాలయాలు ప్రతిధ్వనిస్తున్నాయని వ్యాఖ్యానించారు.

ఈ ప్రాచీన ఆలయాలకు యునెస్కో ప్రపంచ వారసత్వ గుర్తింపు తీసుకురావాలని కేంద్రాన్ని కోరుతూ గట్టి స్వరం వినిపించారు. సరైన ప్రణాళిక, పర్యాటక మౌలిక వసతులు కల్పిస్తే పానగల్ ఆలయాలు అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేక స్థానాన్ని సంపాదిస్తాయని స్పష్టం చేశారు.

మహాశివరాత్రి వేళ పానగల్ ఆధ్యాత్మిక జ్వాల మరింత ప్రజ్వలించింది. భక్తి, చరిత్ర, శిల్ప వైభవం కలిసిన ఈ క్షణాలు నల్లగొండకు కొత్త గుర్తింపునిచ్చే సంకేతాలుగా మారాయి.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News