Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 05:28 AM

మిత్రుని కుటుంబానికి అండగా… స్నేహానికి నిలువెత్తు ఉదాహరణ

మిత్రుని కుటుంబానికి అండగా… స్నేహానికి నిలువెత్తు ఉదాహరణ

మిత్రుని కుటుంబానికి అండగా… స్నేహానికి నిలువెత్తు ఉదాహరణ
February 18, 2026 05:24 PM 412 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట,

అనారోగ్యంతో అకాల మరణం చెందిన చిరకాల మిత్రుడు గురుకు శివప్రసాద్ కుటుంబానికి అండగా నిలుస్తూ స్నేహితులు నిజమైన మిత్రత్వానికి అర్థం చెప్పిన ఘటన రామన్నపేటలో చోటుచేసుకుంది.

రామన్నపేట మండల కేంద్రానికి చెందిన గురుకు శివప్రసాద్ ఇటీవల అనారోగ్యంతో కన్నుమూశారు. ఈ విషయం తెలిసిన వెంటనే 2006-07 విద్యాసంవత్సరంలో రామన్నపేట ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి చదివిన బ్యాచ్ మిత్రులు ఒక్కటయ్యారు. “మిత్రుని కుటుంబానికి ఈ కష్టకాలంలో తోడుగా ఉండాలి” అనే సంకల్పంతో ముందుకు వచ్చారు.

స్నేహబంధానికి నిదర్శనంగా వారు తమవంతుగా రూ.22,000 సేకరించి, బుధవారం దశదిన కర్మ రోజు మృతుని కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.

“స్నేహం మాటల్లో కాదు… అవసర సమయంలో అండగా నిలబడటంలో ఉంది” అని మిత్రులు పేర్కొన్నారు. ఈ సంఘటన స్థానికంగా హృదయాలను కదిలించింది

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News