మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికలు–2026 నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మీడియా కార్యకలాపాల సమన్వయం కోసం ప్రత్యేక మీడియా సమన్వయ కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్కుమార్ గౌడ్ ప్రకటించారు.అఖిల భారత కాంగ్రెస్ కమిటీ తెలంగాణ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ అనుమతితో ఈ నియామకాలు చేపట్టినట్లు తెలిపారు. కమిటీ తక్షణమే అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు.మీడియా సమన్వయ కమిటీ సభ్యుడిగా మేడి రవిచంద్రను నియమించారు.
మున్సిపల్ ఎన్నికల సమయంలో పార్టీ అభ్యర్థులు, ప్రచార కార్యక్రమాలు, ప్రజాసంబంధిత అంశాలను సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఈ కమిటీ కీలక పాత్ర పోషిస్తుందని టీపీసీసీ అధ్యక్షుడు పేర్కొన్నారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి