Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఇంటర్ ఫలితాల్లో 'అరవిందో' ప్రభంజనం కొత్త గ్యాస్ కనెక్షన్లు నిలిపివేత.. సరఫరా సంక్షోభం ప్రభావం సెన్సస్-2027 నిబంధనలు కఠినం.. ఉల్లంఘిస్తే జరిమానా, జైలు శిక్ష కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 13, 2026 11:05 PM

మే 11 గృహ గణనకు సన్నాహాలు వేగవంతం చేయాలి.శ్రీమతి భారతి హోళికేరి

మే 11 గృహ గణనకు సన్నాహాలు వేగవంతం చేయాలి.శ్రీమతి భారతి హోళికేరి

మే 11 గృహ గణనకు సన్నాహాలు వేగవంతం చేయాలి.శ్రీమతి భారతి హోళికేరి
April 13, 2026 08:49 PM 16 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రాష్ట్రంలో మే 11న నిర్వహించనున్న గృహ గణన కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను వేగవంతంగా పూర్తి చేయాలని రాష్ట్ర జనగణన అధికారి శ్రీమతి భారతి హోళికేరి సూచించారు.

ఈ సందర్భంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి గృహ గణనపై అవసరమైన దిశానిర్దేశం చేశారు. గణన విజయవంతం కావాలంటే ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో చురుకుగా పాల్గొని సరైన వివరాలు అందించాలని పిలుపునిచ్చారు.

హౌస్ లిస్టింగ్ ప్రక్రియలో భాగంగా ఇండ్ల జాబితా బ్లాకులు రూపొందించడం, ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్ల నియామకం, మండల స్థాయిలో శిక్షణ కార్యక్రమాలు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. క్షేత్ర స్థాయిలో అధికారులు కట్టుదిట్టంగా పర్యవేక్షణ చేపట్టి ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఇండ్ల గణన, జనగణన వివరాల ఆధారంగా అర్హులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు సమర్థంగా అందించేందుకు ఈ ప్రక్రియ దోహదపడుతుందని తెలిపారు. విద్యావంతులు, ఉద్యోగులు ముందుండి ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన అదనపు గణనాధికారి భాస్కరరావు, జిల్లా సెన్సస్ అధికారి శ్రీమతి జయమ్మ, సీపీఓ కార్యాలయ సిబ్బంది రమేష్, శ్రీనివాస్ పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News