Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 09:48 PM

మే 11 గృహ గణనకు సన్నాహాలు వేగవంతం చేయాలి.శ్రీమతి భారతి హోళికేరి

మే 11 గృహ గణనకు సన్నాహాలు వేగవంతం చేయాలి.శ్రీమతి భారతి హోళికేరి

మే 11 గృహ గణనకు సన్నాహాలు వేగవంతం చేయాలి.శ్రీమతి భారతి హోళికేరి
13-04-2026 38 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రాష్ట్రంలో మే 11న నిర్వహించనున్న గృహ గణన కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను వేగవంతంగా పూర్తి చేయాలని రాష్ట్ర జనగణన అధికారి శ్రీమతి భారతి హోళికేరి సూచించారు.

ఈ సందర్భంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి గృహ గణనపై అవసరమైన దిశానిర్దేశం చేశారు. గణన విజయవంతం కావాలంటే ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో చురుకుగా పాల్గొని సరైన వివరాలు అందించాలని పిలుపునిచ్చారు.

హౌస్ లిస్టింగ్ ప్రక్రియలో భాగంగా ఇండ్ల జాబితా బ్లాకులు రూపొందించడం, ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్ల నియామకం, మండల స్థాయిలో శిక్షణ కార్యక్రమాలు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. క్షేత్ర స్థాయిలో అధికారులు కట్టుదిట్టంగా పర్యవేక్షణ చేపట్టి ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఇండ్ల గణన, జనగణన వివరాల ఆధారంగా అర్హులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు సమర్థంగా అందించేందుకు ఈ ప్రక్రియ దోహదపడుతుందని తెలిపారు. విద్యావంతులు, ఉద్యోగులు ముందుండి ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన అదనపు గణనాధికారి భాస్కరరావు, జిల్లా సెన్సస్ అధికారి శ్రీమతి జయమ్మ, సీపీఓ కార్యాలయ సిబ్బంది రమేష్, శ్రీనివాస్ పాల్గొన్నారు.

Sthanikam

మే 11 గృహ గణనకు సన్నాహాలు వేగవంతం చేయాలి.శ్రీమతి భారతి హోళికేరి

Article Image

రాష్ట్రంలో మే 11న నిర్వహించనున్న గృహ గణన కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను వేగవంతంగా పూర్తి చేయాలని రాష్ట్ర జనగణన అధికారి శ్రీమతి భారతి హోళికేరి సూచించారు.

ఈ సందర్భంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి గృహ గణనపై అవసరమైన దిశానిర్దేశం చేశారు. గణన విజయవంతం కావాలంటే ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో చురుకుగా పాల్గొని సరైన వివరాలు అందించాలని పిలుపునిచ్చారు.

హౌస్ లిస్టింగ్ ప్రక్రియలో భాగంగా ఇండ్ల జాబితా బ్లాకులు రూపొందించడం, ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్ల నియామకం, మండల స్థాయిలో శిక్షణ కార్యక్రమాలు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. క్షేత్ర స్థాయిలో అధికారులు కట్టుదిట్టంగా పర్యవేక్షణ చేపట్టి ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఇండ్ల గణన, జనగణన వివరాల ఆధారంగా అర్హులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు సమర్థంగా అందించేందుకు ఈ ప్రక్రియ దోహదపడుతుందని తెలిపారు. విద్యావంతులు, ఉద్యోగులు ముందుండి ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన అదనపు గణనాధికారి భాస్కరరావు, జిల్లా సెన్సస్ అధికారి శ్రీమతి జయమ్మ, సీపీఓ కార్యాలయ సిబ్బంది రమేష్, శ్రీనివాస్ పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News