మే 11 గృహ గణనకు సన్నాహాలు వేగవంతం చేయాలి.శ్రీమతి భారతి హోళికేరి
మే 11 గృహ గణనకు సన్నాహాలు వేగవంతం చేయాలి.శ్రీమతి భారతి హోళికేరి
Editor Desk
రాష్ట్రంలో మే 11న నిర్వహించనున్న గృహ గణన కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను వేగవంతంగా పూర్తి చేయాలని రాష్ట్ర జనగణన అధికారి శ్రీమతి భారతి హోళికేరి సూచించారు.
ఈ సందర్భంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి గృహ గణనపై అవసరమైన దిశానిర్దేశం చేశారు. గణన విజయవంతం కావాలంటే ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో చురుకుగా పాల్గొని సరైన వివరాలు అందించాలని పిలుపునిచ్చారు.
హౌస్ లిస్టింగ్ ప్రక్రియలో భాగంగా ఇండ్ల జాబితా బ్లాకులు రూపొందించడం, ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్ల నియామకం, మండల స్థాయిలో శిక్షణ కార్యక్రమాలు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. క్షేత్ర స్థాయిలో అధికారులు కట్టుదిట్టంగా పర్యవేక్షణ చేపట్టి ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఇండ్ల గణన, జనగణన వివరాల ఆధారంగా అర్హులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు సమర్థంగా అందించేందుకు ఈ ప్రక్రియ దోహదపడుతుందని తెలిపారు. విద్యావంతులు, ఉద్యోగులు ముందుండి ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన అదనపు గణనాధికారి భాస్కరరావు, జిల్లా సెన్సస్ అధికారి శ్రీమతి జయమ్మ, సీపీఓ కార్యాలయ సిబ్బంది రమేష్, శ్రీనివాస్ పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి