ముంబయిలో తెలంగాణ ప్రజా సంఘం 2026 క్యాలెండర్ ఆవిష్కరణ
ముంబయిలో తెలంగాణ ప్రజా సంఘం 2026 క్యాలెండర్ ఆవిష్కరణ
స్థానికం బృందం
చిట్యాల స్థానికం ప్రతినిధి రిపోర్టర్ ప్రశాంత్
తెలంగాణ రాష్ట్రం నుంచి ముంబయికి వచ్చి గోరేగావ్ పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న తెలంగాణ ప్రజలతో ఏర్పడిన తెలంగాణ ప్రజా సంఘం ఆధ్వర్యంలో అధ్యక్షులు పరమేష్ భీమనపల్లి 2026 సంవత్సరానికి సంబంధించిన నూతన క్యాలెండర్ ను ఘనంగా ఆవిష్కరించారు. ఆదివారం రాత్రి నిర్వహించిన ఈ కార్యక్రమం సంఘ సభ్యుల్లో ఉత్సాహాన్ని నింపింది, ఈ సందర్భంగా మాట్లాడుతూ ముంబయిలో నివసిస్తున్న తెలంగాణ ప్రజల మధ్య ఐక్యతను పెంపొందించడంతో పాటు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను తరతరాలకు అందించడమే తెలంగాణ ప్రజా సంఘం లక్ష్యమని తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాలు కొనసాగిస్తామని పేర్కొన్నారు, ఈ కార్యక్రమంలో కార్యదర్శి నర్సి రెడ్డి మన్నే పాల్గొని క్యాలెండర్ను ఆవిష్కరించారు. సంఘ ఉపాధ్యక్షులు అంజయ్య సుక్క, కృష్ణ కురుపాటి, కోశాధికారి మల్లేష్ సూర్వి, సహాయ కార్యదర్శులు మల్లేష్ గాదె, నర్సింహా నాయక్, శ్రీను, శ్రీనివాస్ చుక్క సంఘ సలహాదారులు విరమళ్ళ మల్లేష్, స్వామి లకేలపల్లి, శేఖర్ వంటెపాక, గణేష్ మచ్చతో పాటు ఇతర సంఘ నాయకులు, సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి