మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా అవగాహన రన్
మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా అవగాహన రన్
స్థానికం బృందం
యువతలో చైతన్యం కల్పించాలి: జక్క వెంకట్ రెడ్డి
మేడిపల్లి,: యువతను మత్తు పదార్థాల బారిన పడకుండా కాపాడేందుకు అవగాహన అత్యంత అవసరమని మాజీ మేయర్ జక్క వెంకట్ రెడ్డి అన్నారు.
మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నారాపల్లి నందనవనంలో శాంతివనం రన్నర్స్ ఆధ్వర్యంలో “రన్ ఫర్ డ్రగ్ ఫ్రీ లైఫ్” పేరుతో నిర్వహించిన భారీ అవగాహన రన్ను ఆయన జెండా ఊపి ప్రారంభించారు.
16కే, 10కే, 5కే, 3కే విభాగాల్లో జరిగిన ఈ రన్లో వందలాది మంది యువత, విద్యార్థులు, మహిళలు, ఫిట్నెస్ అభిమానులు ఉత్సాహంగా పాల్గొన్నారు. “డ్రగ్స్ వద్దు – పుస్తకాలే ముద్దు” వంటి నినాదాలతో మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా సందేశం ఇచ్చారు.
ఈ సందర్భంగా జక్క వెంకట్ రెడ్డి మాట్లాడుతూ, డ్రగ్స్ అనే సామాజిక వ్యాధి యువత భవిష్యత్తును దెబ్బతీస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి కార్యక్రమాలు నిరంతరం కొనసాగాలని, ప్రతి కుటుంబం ఈ సామాజిక పోరాటంలో భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు. అనంతరం పాల్గొన్న రన్నర్లకు మెడల్స్, సర్టిఫికేట్లు అందజేశారు.
సీఐ మక్బూల్ జాని మాట్లాడుతూ, మత్తు పదార్థాల వినియోగం చట్టరీత్యా నేరమని, యువత వాటికి దూరంగా ఉండాలని సూచించారు. అనుమానాస్పద కార్యకలాపాలపై వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఆర్.వి ఫౌండేషన్ ప్రతినిధులు, తుంగతుర్తి రవి, వాకిటి శ్రీకాంత్ రెడ్డి, నిర్వాహకులు సోమశేఖర్, శేఖర్, స్వచ్ఛంద సంస్థల సభ్యులు, క్రీడాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి