Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గుడి బండలా మారిన గ్యాస్ బండి… క్యూలో నిల్చొని అలసిపోయిన వినియోగదారులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 10:38 AM

మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా అవగాహన రన్

మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా అవగాహన రన్

మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా అవగాహన రన్
February 22, 2026 07:25 PM 11 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యువతలో చైతన్యం కల్పించాలి: జక్క వెంకట్ రెడ్డి

మేడిపల్లి,: యువతను మత్తు పదార్థాల బారిన పడకుండా కాపాడేందుకు అవగాహన అత్యంత అవసరమని మాజీ మేయర్ జక్క వెంకట్ రెడ్డి అన్నారు.

మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నారాపల్లి నందనవనంలో శాంతివనం రన్నర్స్ ఆధ్వర్యంలో “రన్ ఫర్ డ్రగ్ ఫ్రీ లైఫ్” పేరుతో నిర్వహించిన భారీ అవగాహన రన్‌ను ఆయన జెండా ఊపి ప్రారంభించారు.

16కే, 10కే, 5కే, 3కే విభాగాల్లో జరిగిన ఈ రన్‌లో వందలాది మంది యువత, విద్యార్థులు, మహిళలు, ఫిట్‌నెస్ అభిమానులు ఉత్సాహంగా పాల్గొన్నారు. “డ్రగ్స్ వద్దు – పుస్తకాలే ముద్దు” వంటి నినాదాలతో మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా సందేశం ఇచ్చారు.

ఈ సందర్భంగా జక్క వెంకట్ రెడ్డి మాట్లాడుతూ, డ్రగ్స్ అనే సామాజిక వ్యాధి యువత భవిష్యత్తును దెబ్బతీస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి కార్యక్రమాలు నిరంతరం కొనసాగాలని, ప్రతి కుటుంబం ఈ సామాజిక పోరాటంలో భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు. అనంతరం పాల్గొన్న రన్నర్లకు మెడల్స్, సర్టిఫికేట్లు అందజేశారు.

సీఐ మక్బూల్ జాని మాట్లాడుతూ, మత్తు పదార్థాల వినియోగం చట్టరీత్యా నేరమని, యువత వాటికి దూరంగా ఉండాలని సూచించారు. అనుమానాస్పద కార్యకలాపాలపై వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ఆర్.వి ఫౌండేషన్ ప్రతినిధులు, తుంగతుర్తి రవి, వాకిటి శ్రీకాంత్ రెడ్డి, నిర్వాహకులు సోమశేఖర్, శేఖర్, స్వచ్ఛంద సంస్థల సభ్యులు, క్రీడాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News