మట్టి నమూనాల సేకరణపై మోడల్ స్కూల్ విద్యార్థులకు అవగాహన
మట్టి నమూనాల సేకరణపై మోడల్ స్కూల్ విద్యార్థులకు అవగాహన
Biksham
సూర్యాపేట జిల్లా స్థానికం ప్రతినిధి బిక్షం
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్కూల్ సాయిల్ హెల్త్ ప్రోగ్రాంలో భాగంగా మునగాల మండలంలోని మోడల్ స్కూల్ను ఎంపిక చేశారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల చేత రైతుల పొలాల నుంచి మట్టి నమూనాల సేకరణ, వాటి ఫలితాల విశ్లేషణ, రైతులకు సాయిల్ హెల్త్ కార్డుల పంపిణీతో పాటు పంటలకు అవసరమైన పోషకాలపై అవగాహన కల్పించనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా శనివారం మోడల్ స్కూల్లో 7వ, 8వ, 9వ తరగతి విద్యార్థినీ, విద్యార్థులకు మట్టి నమూనాల సేకరణ ఆవశ్యకత, నమూనాలు తీసుకునే విధానాన్ని ప్రాయోగికంగా వివరించారు. మట్టినాణ్యత తెలుసుకోవడం ద్వారా పంట దిగుబడులు పెరుగుతాయని, ఎరువుల వినియోగం సమర్థవంతంగా ఉంటుందని విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి బి. రాజు, వ్యవసాయ విస్తరణాధికారులు భవాని, నాగు, మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ సైదయ్య గౌడ్, ఉపాధ్యాయుడు సైదులు పాల్గొని విద్యార్థులకు సూచనలు చేశారు. పెద్ద సంఖ్యలో విద్యార్థినీ, విద్యార్థులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి