Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 05:33 AM

మసీదుల వద్ద మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి – అదనపు కలెక్టర్ భాస్కర్ రావు

మసీదుల వద్ద మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి – అదనపు కలెక్టర్ భాస్కర్ రావు

మసీదుల వద్ద మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి – అదనపు కలెక్టర్ భాస్కర్ రావు
February 18, 2026 02:59 PM 55 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

పవిత్ర రంజాన్ సందర్భంగా ముస్లింలకు అన్ని వసతులు కల్పించాలి

పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం కానున్న నేపథ్యంలో జిల్లాలోని అన్ని మసీదుల వద్ద అవసరమైన మౌలిక వసతులు సమకూర్చాలని జిల్లా అదనపు కలెక్టర్ భాస్కర్ రావు సంబంధిత అధికారులను ఆదేశించారు.

బుధవారం జిల్లా కేంద్రంలోని మినీ మీటింగ్ హాలులో రంజాన్ మాసం పురస్కరించుకొని శాంతి సంఘ సమావేశం అదనపు కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించబడింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రంజాన్ ఏర్పాట్లకు సంబంధించి ప్రతి శాఖకు కేటాయించిన బాధ్యతలను సమన్వయంతో, సమయపాలనతో నిర్వహించాలని సూచించారు.

ప్రత్యేకంగా నమాజ్ సమయాల్లో విద్యుత్ అంతరాయం లేకుండా చూసుకోవాలని, మసీదుల వద్ద కరెంట్, మంచినీటి సరఫరా నిరంతరంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మసీదుల పరిసరాల్లో పటిష్ట పారిశుధ్య పనులు చేపట్టడంతో పాటు వీధి దీపాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని సూచించారు. మున్సిపాలిటీ వార్డులలో మంచినీరు సమయానికి అందేలా చర్యలు తీసుకోవాలని, సరఫరాలో ఎలాంటి అంతరాయాలు రాకుండా పర్యవేక్షణ చేయాలన్నారు.

రంజాన్ మాసాన్ని సోదరభావంతో, ప్రశాంత వాతావరణంలో జరుపుకునేలా అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని, జిల్లా మతసామరస్యానికి ప్రతీకగా నిలవాలని అదనపు కలెక్టర్ ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ లక్ష్మి నారాయణ మాట్లాడుతూ రంజాన్ మాసంలో మసీదుల వద్ద పూర్తి బందోబస్తు ఏర్పాటు చేస్తామని తెలిపారు. భద్రతా పరమైన అన్ని చర్యలు చేపట్టి, మత పెద్దలతో సమన్వయం సాధించి సామరస్య వాతావరణంలో ప్రార్థనలు జరిగేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News