Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తెలంగాణ పోలీసు క్రీడల్లో మూడు విభాగాల్లో కాంస్య పతకాలు సాధించి నల్లగొండ ఖ్యాతిని నిలబెట్టిన షకీర్ 18 ఏళ్ల తర్వాత భువనగిరి చేనేత సంఘానికి ఎన్నికలు..చైర్మన్‌గా ఏలే సుధాకర్ ఎన్నిక మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 06:24 AM

మార్చిలోనే పరిషత్ ఎన్నికలు..? రూ.450 కోట్ల నిధులే ప్రధాన కారణం

మార్చిలోనే పరిషత్ ఎన్నికలు..? రూ.450 కోట్ల నిధులే ప్రధాన కారణం

మార్చిలోనే పరిషత్ ఎన్నికలు..? రూ.450 కోట్ల నిధులే ప్రధాన కారణం
February 12, 2026 08:46 PM 78 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

వేగంగా కదులుతున్న రాష్ట్ర ప్రభుత్వం – తొలి వారంలో రెండు విడతల పరిశీలన

హైదరాబాద్

తెలంగాణలో జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికలను మార్చి నెలలోనే నిర్వహించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచనలు వేగవంతం చేసినట్లు విశ్వసనీయ సమాచారం. మునిసిపల్ ఎన్నికల ఫలితాలు అనుకూలంగా వస్తే అదే ఊపును కొనసాగిస్తూ పరిషత్ ఎన్నికలకు వెళ్లాలన్న వ్యూహంతో ప్రభుత్వం ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలన్న అవసరం ప్రభుత్వ ముందున్న ప్రధాన అంశంగా మారింది. ఈ ఏడాది లోపల పరిషత్ ఎన్నికలు నిర్వహించకపోతే జిల్లా, మండల పరిషత్‌లకు కేంద్రం నుంచి రావాల్సిన సుమారు రూ.450 కోట్ల నిధులు నిలిచిపోయే అవకాశం ఉందని అధికారులు సూచిస్తున్నట్లు సమాచారం. అభివృద్ధి కార్యక్రమాలపై దాని ప్రభావం పడే అవకాశముండటంతో ఎన్నికల ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలనే దిశగా యంత్రాంగం కసరత్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది.

ఎన్నికల నిర్వహణకు సంబంధించి ప్రాథమిక సన్నాహాలు ఇప్పటికే ప్రారంభమైనట్లు సమాచారం. మార్చి తొలి వారంలో రెండు విడతలుగా పోలింగ్ నిర్వహించే అవకాశాలపై పరిశీలన జరుగుతోందని అధికార వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్ర ఎన్నికల సంఘంతో సమన్వయం సాధించి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని సమాచారం. రాజకీయంగా కూడా ఈ ఎన్నికలు కీలకంగా మారనున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో తమ బలం నిరూపించుకోవాలనే లక్ష్యంతో ప్రధాన రాజకీయ పార్టీలు ఇప్పటికే వ్యూహరచనలో నిమగ్నమయ్యాయి. మునిసిపల్ ఎన్నికల ఫలితాల ప్రభావం పరిషత్ ఎన్నికలపై పడే అవకాశం ఉండటంతో అన్ని పార్టీల దృష్టి గ్రామీణ ఓటర్లపై కేంద్రీకృతమైంది.ఆర్థిక పరిమితులు, రాజకీయ లెక్కలు కలిసివచ్చిన నేపథ్యంలో రాష్ట్రంలో పరిషత్ ఎన్నికల వేడి త్వరలోనే మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అధికారిక ప్రకటన వెలువడిన వెంటనే ఎన్నికల షెడ్యూల్‌పై స్పష్టత రానుంది.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News