Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: February 23, 2026 05:37 PM

మార్చి 16 నుంచి ఒంటిపూట బడులు

మార్చి 16 నుంచి ఒంటిపూట బడులు

మార్చి 16 నుంచి ఒంటిపూట బడులు
February 18, 2026 08:47 AM 122 Views
Reporter
స్థానికం ప్రతినిధి : సూర్యాపేట జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Biksham Goud


ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు తరగతులు – ఏప్రిల్ 24 నుంచి వేసవి సెలవులు

హైదరాబాద్:

రాష్ట్రంలోని పాఠశాలల్లో మార్చి 16 నుంచి ఒంటిపూట బడులు ప్రారంభం కానున్నాయి. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు మాత్రమే తరగతులు నిర్వహించనున్నారు. అనంతరం 12.30 గంటలకు మధ్యాహ్న భోజనం అందజేస్తారు.

పదో తరగతి పరీక్ష కేంద్రాలుగా ఉన్న పాఠశాలల్లో మాత్రం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు తరగతులు నిర్వహిస్తారు. పరీక్షలున్నంత కాలం పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు కొనసాగుతాయి. ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు వేసవి సెలవులు ప్రకటించారు. జూన్ 12 నుంచి 2026–27 కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కానుంది. రంజాన్ నేపథ్యంలో ఉర్దూ మాధ్యమ పాఠశాలలు, ఉపాధ్యాయ శిక్షణ కళాశాలలకు ఫిబ్రవరి 19 నుంచి మార్చి 20 వరకు ఒంటిపూట బడులు నిర్వహించే వెసులుబాటు కల్పించారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు తరగతులు నడపాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ తెలిపారు. మార్చి 20 తర్వాత బడులు, ఉపాధ్యాయ శిక్షణ కళాశాలలను అదనపు సమయంతో నిర్వహించాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News