Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఉద్యోగుల డిమాండ్లపై మహాధర్నా అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 28, 2026 01:26 PM

మార్చి 16 నుంచి ఒంటిపూట బడులు

మార్చి 16 నుంచి ఒంటిపూట బడులు

మార్చి 16 నుంచి ఒంటిపూట బడులు
18-02-2026 149 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham


ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు తరగతులు – ఏప్రిల్ 24 నుంచి వేసవి సెలవులు

హైదరాబాద్:

రాష్ట్రంలోని పాఠశాలల్లో మార్చి 16 నుంచి ఒంటిపూట బడులు ప్రారంభం కానున్నాయి. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు మాత్రమే తరగతులు నిర్వహించనున్నారు. అనంతరం 12.30 గంటలకు మధ్యాహ్న భోజనం అందజేస్తారు.

పదో తరగతి పరీక్ష కేంద్రాలుగా ఉన్న పాఠశాలల్లో మాత్రం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు తరగతులు నిర్వహిస్తారు. పరీక్షలున్నంత కాలం పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు కొనసాగుతాయి. ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు వేసవి సెలవులు ప్రకటించారు. జూన్ 12 నుంచి 2026–27 కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కానుంది. రంజాన్ నేపథ్యంలో ఉర్దూ మాధ్యమ పాఠశాలలు, ఉపాధ్యాయ శిక్షణ కళాశాలలకు ఫిబ్రవరి 19 నుంచి మార్చి 20 వరకు ఒంటిపూట బడులు నిర్వహించే వెసులుబాటు కల్పించారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు తరగతులు నడపాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ తెలిపారు. మార్చి 20 తర్వాత బడులు, ఉపాధ్యాయ శిక్షణ కళాశాలలను అదనపు సమయంతో నిర్వహించాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.


Sthanikam

మార్చి 16 నుంచి ఒంటిపూట బడులు

Article Image


ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు తరగతులు – ఏప్రిల్ 24 నుంచి వేసవి సెలవులు

హైదరాబాద్:

రాష్ట్రంలోని పాఠశాలల్లో మార్చి 16 నుంచి ఒంటిపూట బడులు ప్రారంభం కానున్నాయి. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు మాత్రమే తరగతులు నిర్వహించనున్నారు. అనంతరం 12.30 గంటలకు మధ్యాహ్న భోజనం అందజేస్తారు.

పదో తరగతి పరీక్ష కేంద్రాలుగా ఉన్న పాఠశాలల్లో మాత్రం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు తరగతులు నిర్వహిస్తారు. పరీక్షలున్నంత కాలం పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు కొనసాగుతాయి. ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు వేసవి సెలవులు ప్రకటించారు. జూన్ 12 నుంచి 2026–27 కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కానుంది. రంజాన్ నేపథ్యంలో ఉర్దూ మాధ్యమ పాఠశాలలు, ఉపాధ్యాయ శిక్షణ కళాశాలలకు ఫిబ్రవరి 19 నుంచి మార్చి 20 వరకు ఒంటిపూట బడులు నిర్వహించే వెసులుబాటు కల్పించారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు తరగతులు నడపాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ తెలిపారు. మార్చి 20 తర్వాత బడులు, ఉపాధ్యాయ శిక్షణ కళాశాలలను అదనపు సమయంతో నిర్వహించాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News