మనోవిజ్ఞాన శాస్త్రంలో శ్రీవేణికి డాక్టరేట్
మనోవిజ్ఞాన శాస్త్రంలో శ్రీవేణికి డాక్టరేట్
స్థానికం బృందం
హైదరాబాద్:
డా. బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ విశ్వవిద్యాలయంలో సేవలందిస్తున్న డి. శ్రీవేణికి ఉస్మానియా విశ్వవిద్యాలయం మనోవిజ్ఞాన శాస్త్రంలో డాక్టరేట్ ప్రదానం చేసింది. ఈ ఘనతతో విద్యా లోకంలో ఆమెకు ప్రత్యేక గుర్తింపు లభించింది. ప్రస్తుతం అంబేద్కర్ ఓపెన్ విశ్వవిద్యాలయం మనోవిజ్ఞాన విభాగం విభాగాధిపతి బాధ్యతలు నిర్వహిస్తున్న శ్రీవేణి, మేధో వికలాంగులు వృత్తి ఆధారిత ఉపాధి కేంద్రాలలో పనిచేస్తున్న సందర్భంలో వారి ఆత్మవిశ్వాసం, పనితీరు తీరుపై లోతైన పరిశోధన నిర్వహించారు.
ఈ పరిశోధనకు మేధో వికలాంగుల జాతీయ సాధికార సంస్థలో పనిచేసి పదవీ విరమణ పొందిన డాక్టర్ సరోజ్ ఆర్య మార్గదర్శకత్వం వహించారు. మేధో వికలాంగులలో దాగి ఉన్న సామర్థ్యాన్ని వెలికి తీసి, వారి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంలో ఈ అధ్యయనం కీలకంగా నిలుస్తుందని విశ్వవిద్యాలయ వర్గాలు అభిప్రాయపడ్డాయి.కుటుంబ బాధ్యతలు, బోధన, పరిపాలనా విధులు సమన్వయం చేసుకుంటూ ఎన్నో సంవత్సరాల నిరంతర శ్రమ తర్వాత డాక్టరేట్ సాధించడం ప్రశంసనీయం అని సహచరులు కొనియాడుతున్నారు. ఈ విజయం యువ పరిశోధకులు, అధ్యాపకులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని వారు పేర్కొన్నారు.ఈ సందర్భంగా స్నేహితులు, బంధువులు, సహచర అధ్యాపకులు, విద్యావేత్తలు శ్రీవేణికి శుభాకాంక్షలు తెలిపారు. సమగ్ర విద్య, సామాజిక అభివృద్ధిని లక్ష్యంగా చేసుకున్న ఈ పరిశోధన భవిష్యత్ పరిశోధకులకు దిశానిర్దేశకంగా నిలుస్తుందని వారు అభిప్రాయపడ్డారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి