Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
హెడ్ కానిస్టేబుల్ అంగోతు యాదగిరికి ఘన నివాళి పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 02:39 PM

మానవీయ విలువల పునరుజ్జీవానికి గ్రంథాలయ ఉద్యమం

మానవీయ విలువల పునరుజ్జీవానికి గ్రంథాలయ ఉద్యమం

మానవీయ విలువల పునరుజ్జీవానికి గ్రంథాలయ ఉద్యమం
February 01, 2026 05:24 PM 83 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

సృజనాత్మక శక్తుల వెలికితీతే లక్ష్యంగా బస్సు యాత్ర

నేటి ఆధునిక జీవన విధానంలో క్రమంగా అంతరించిపోతున్న మానవీయ విలువలను పునరుద్ధరించడంతో పాటు, చరవాణీ మోజులో మునిగిపోయి పిల్లలు కోల్పోతున్న సృజనాత్మక శక్తులను వెలికి తీయాలన్న లక్ష్యంతో ప్రారంభమైన మరో మాతృభాష ఉద్యమమే గ్రంథాలయ ఉద్యమమని ‘మరో గ్రంథాలయ ఉద్యమ బస్సు యాత్ర’ నాయకులు మంచి కంటి, బండారు విజయ తెలిపారు.

ఆదివారం హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ప్రారంభమైన బస్సు యాత్ర మధ్యాహ్నం భువనగిరికి చేరుకుంది. ఈ సందర్భంగా భువనగిరిలోని హైదరాబాద్ చౌరస్తా వద్ద సాహితీ మిత్రులు, ప్రజాసంఘాల ప్రతినిధులు బస్సు యాత్రకు ఘన స్వాగతం పలికారు.అనంతరం జిల్లా గ్రంథాలయ సంస్థ ఆవరణలో నిర్వహించిన సమావేశంలో బస్సు యాత్ర రాష్ట్ర బాధ్యురాలు బండారు విజయ మాట్లాడుతూ, ప్రజల నుంచి గ్రంథాలయాల అభివృద్ధి కోసం వసూలు చేసిన పన్నును అదే ప్రయోజనానికి వినియోగించడం లేదని విమర్శించారు. యువత విజ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు సాధించడానికి పుస్తక పఠనం నిత్య జీవితంలో భాగం కావాలని పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో మరో రాష్ట్ర బాధ్యుడు మంచి కంటి మాట్లాడుతూ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పిల్లలు, పెద్దలు, మహిళలు అనేక విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి గ్రామంలో పాఠశాలల్లో, ఇళ్లలో చిన్న చిన్న గ్రంథాలయాలను ఏర్పాటు చేసుకుని పుస్తక పఠనంపై ఆసక్తిని పెంచుకోవాలని ప్రజలను కోరారు


.ఈ కార్యక్రమంలో బస్సు యాత్ర రాష్ట్ర బాధ్యులు కస్తూరి ప్రభాకర్, కాసుల రవికుమార్, మలుపు బాల్ రెడ్డి పాల్గొన్నారు. అలాగే యాదాద్రి భువనగిరి జిల్లా బాధ్యులు కొడారి వెంకటేష్, బట్టు రామచంద్రయ్య, శ్రీనివాసాచారి, బర్రె సుదర్శన్, జంపాల అంజయ్య, పోలి శంకర్ రెడ్డి, శోభ, సిరిపంగ శివలింగం, జిల్లా గ్రంథాలయ సంస్థ గ్రంథపాలకుడు జంపయ్య, గ్రంథాలయ పాఠకులు, సాహితీ ప్రియులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News