తిరువూరు: తిరువూరు మండలంలోని వాముకుంట్ల గ్రామం చివరలో ఉన్న మామిడి తోటల్లో పేకాట, పందాలు ఆడుతున్నారన్న సమాచారం మేరకు తిరువూరు పోలీసులు ఆకస్మికంగా దాడి నిర్వహించారు.
దాడి సమయంలో పేకాట ఆడుతున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి రూ.6,890 నగదును స్వాధీనం చేసుకున్నారు.
అరెస్టు చేసిన వారిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో అక్రమంగా పేకాట, పందాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి