Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 04:35 AM

మల్లికార్జున నగర్‌లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన

మల్లికార్జున నగర్‌లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన

మల్లికార్జున నగర్‌లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
February 07, 2026 04:58 PM 25 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రహదారులు, డ్రైనేజీ, పార్క్, కమ్యూనిటీ హాల్‌కు ఊపొచ్చిన పనులు

వనస్థలిపురం డివిజన్ పరిధిలోని మల్లికార్జున నగర్ కాలనీలో పలు అభివృద్ధి పనులకు బుధవారం శంకుస్థాపన జరిగింది. డివిజన్ కార్పొరేటర్ రాగుల వెంకటేశ్వర్ రెడ్డి చేతుల మీదుగా ఈ కార్యక్రమం నిర్వహించారు. మల్లికార్జున నగర్ కాలనీ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపట్టనున్న పనులకు ఆయన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.కాలనీ సర్వతోముఖాభివృద్ధే లక్ష్యంగా రోడ్ నంబర్–1లో మిగిలిన డ్రైనేజీ పైపులైన్ పనులు, రోడ్డు అభివృద్ధి పనులు, కాలనీ పార్క్‌లో నూతన వ్యాయామ పరికరాల ఏర్పాటు, టెంపుల్ రోడ్‌లో ప్లాట్ నంబర్ 68 నుంచి 80 వరకు నూతన డ్రైనేజీ పైపులైన్ పనులు, కమ్యూనిటీ హాల్ నూతన భవన ప్రారంభోత్సవానికి ఈ సందర్భంగా శంకుస్థాపన చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హైదరాబాద్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ పాషం అశోక్ గౌడ్, కర్మన్‌ఘాట్ హనుమాన్ ఆలయ డైరెక్టర్ కవిత హాజరయ్యారు.అలాగే సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఏనుగు నర్సిరెడ్డి, ఉపాధ్యక్షుడు పి. వెంకట రెడ్డి, గౌరవాధ్యక్షుడు డాక్టర్ యాళ్ల ప్రేమ్ కుమార్, ప్రధాన కార్యదర్శి సాయి చరణ్, కోశాధికారి ఎం.డి. షరీఫ్, సంయుక్త కార్యదర్శి ఎం.డి. మహమ్మద్, కార్యవర్గ సభ్యులు అంబటి భగవంత్ రెడ్డి, టి. రవీందర్, యుగంధర్ రెడ్డి, కిరణ్ కుమార్, ఎం. మోహన్ రెడ్డి, ఎం.డి. జియా, ఏ.ఏ. ఖాన్ తదితరులు పాల్గొన్నారు.

కాలనీ దేవాలయ కమిటీ చైర్మన్ వి. వెంకటేశ్వర రావు, సీనియర్ సభ్యులు, వృద్ధులు, వివిధ కాలనీల అధ్యక్షులు ఈ కార్యక్రమంలో పాల్గొని అభివృద్ధి పనులకు మద్దతు తెలిపారు.

ఈ అభివృద్ధి కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రజాప్రతినిధులు, సంఘ నాయకులు, కాలనీ వాసులందరికీ మల్లికార్జున నగర్ కాలనీ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ కృతజ్ఞతలు తెలిపింది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News