Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: February 23, 2026 10:22 PM

మల్లన్న గుట్టపై అర్ధరాత్రి లింగోద్భవ మహాభిషేకం భక్తులతో కిక్కిరిసిన చిన్న శ్రీశైలం

మల్లన్న గుట్టపై అర్ధరాత్రి లింగోద్భవ మహాభిషేకం భక్తులతో కిక్కిరిసిన చిన్న శ్రీశైలం

మల్లన్న గుట్టపై అర్ధరాత్రి లింగోద్భవ మహాభిషేకం భక్తులతో కిక్కిరిసిన చిన్న శ్రీశైలం
February 16, 2026 02:05 AM 253 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
స్థానికం బృందం

రామన్నపేట, నిదానపల్లి:

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని నిదానపల్లి గ్రామంలో మల్లన్న గుట్టపై వెలసిన శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయం నిదానపల్లి (చిన్న శ్రీశైలం) లో మహాశివరాత్రి వేడుకలు భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించబడ్డాయి.

శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని అర్ధరాత్రి 12 గంటల 30 నిమిషాలకు లింగోద్భవ కాలంలో ప్రత్యేక అభిషేకాలు, మహామంగళహారతులు వైభవంగా జరిగాయి. అర్చకులు బేతోజు శశిధర్ దీక్షితులు, అన్వేష, నాగరాజు శాస్త్రి వేదమంత్రోచ్ఛారణల నడుమ స్వామివారికి పాలు, పెరుగు, తేనె, పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. ఆలయ ప్రాంగణం “ఓం నమః శివాయ” నినాదాలతో మార్మోగింది.

ఉత్సవ కమిటీ చైర్మన్ చల్ల నరసింహ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు భాష మళ్ల బాలరాజు, సుంకు స్వామి, ఆగు చిన్న లింగస్వామి, మాజీ సర్పంచ్ గుత్త నర్సింహారెడ్డి, మందడి సంతోష్ రెడ్డి, గ్రామ పెద్దలు, పరిసర గ్రామాల భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మీ స్పందన? 4 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News