మల్లన్న గుట్ట ఉత్సవ కమిటీ చైర్మన్గా చల్ల నరసింహ యాదవ్ ఏకగ్రీవ ఎన్నిక
మల్లన్న గుట్ట ఉత్సవ కమిటీ చైర్మన్గా చల్ల నరసింహ యాదవ్ ఏకగ్రీవ ఎన్నిక
స్థానికం బృందం
రామన్నపేట, నిదానపల్లి:
యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని నిదానపల్లి గ్రామంలో మల్లన్న గుట్టపై కొలువై ఉన్న శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయం (చిన్న శ్రీశైలం) బ్రహ్మోత్సవాలు ఈ నెల 15వ తేదీ శివరాత్రి మొదలు కొని 18వ తేదీ వరకు ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఈ బ్రహ్మోత్సవాల నిర్వహణకు సంబంధించి బుధవారం నిదానపల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఉత్సవ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సమావేశానికి సర్పంచ్ నారపాక మాధవి యాదయ్య, ఉపసర్పంచ్ కొండ అండాల మల్లయ్య, పాలకవర్గ సభ్యులు, గ్రామ పెద్దలు హాజరయ్యారు.ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ చైర్మన్గా చల్ల నరసింహ యాదవ్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
కమిటీ డైరెక్టర్లుగా
సంకు స్వామి, కడారి (మల్లేశం) అంగడయ్య, భాష మల్ల బాలరాజు, ఆగు చిన్న లింగస్వామిలను ఎంపిక చేశారు.
బ్రహ్మోత్సవాలను భక్తుల సహకారంతో సంప్రదాయబద్ధంగా, వైభవంగా నిర్వహించేందుకు కమిటీ కృషి చేస్తుందని నూతన చైర్మన్ చల్ల నరసింహ యాదవ్ తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి