PRINT TIME: April 10, 2026 01:19 PM
మల్లన్న బ్రహ్మోత్సవాలకు సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ రూ.10,000 చందా
మల్లన్న బ్రహ్మోత్సవాలకు సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ రూ.10,000 చందా
February 07, 2026 11:54 AM
208 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
రామన్నపేట,
యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం నిధానం పెళ్లి గ్రామంలో కొలువై ఉన్న శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలకు స్థానిక ప్రజాప్రతినిధులు భక్తి శ్రద్ధలతో సహకారం అందిస్తున్నారు.
నిదానపల్లి మల్లన్న గుట్టలో నిర్వహించనున్న మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఇంద్రపాలనగరం గ్రామ సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ తన వంతు సహాయంగా రూ.10,000 నగదును ఉత్సవ కమిటీ చైర్మన్ చల్ల నరసింహకు అందజేశారు.
ఈ సందర్భంగా సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ మాట్లాడుతూ, గ్రామ దేవతల ఉత్సవాలు ప్రజల ఐక్యతకు ప్రతీకలని, సంప్రదాయాలను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. భక్తుల సహకారంతో బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్లు ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ డైరెక్టర్లు, సభ్యులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి