Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మండల కాంగ్రెస్ అధ్యక్షుల నియామకాలపై ఎలాంటి మార్పు లేదు; ఎమ్మెల్యే సామెల్ తెలంగాణ పోలీసు క్రీడల్లో మూడు విభాగాల్లో కాంస్య పతకాలు సాధించి నల్లగొండ ఖ్యాతిని నిలబెట్టిన షకీర్ మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 12:34 PM

మల్లన్న బ్రహ్మోత్సవాలకు సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ రూ.10,000 చందా

మల్లన్న బ్రహ్మోత్సవాలకు సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ రూ.10,000 చందా

మల్లన్న బ్రహ్మోత్సవాలకు సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ రూ.10,000 చందా
February 07, 2026 11:54 AM 217 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట,

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం నిధానం పెళ్లి గ్రామంలో కొలువై ఉన్న శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలకు స్థానిక ప్రజాప్రతినిధులు భక్తి శ్రద్ధలతో సహకారం అందిస్తున్నారు.

నిదానపల్లి మల్లన్న గుట్టలో నిర్వహించనున్న మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఇంద్రపాలనగరం గ్రామ సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ తన వంతు సహాయంగా రూ.10,000 నగదును ఉత్సవ కమిటీ చైర్మన్ చల్ల నరసింహకు అందజేశారు.

ఈ సందర్భంగా సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ మాట్లాడుతూ, గ్రామ దేవతల ఉత్సవాలు ప్రజల ఐక్యతకు ప్రతీకలని, సంప్రదాయాలను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. భక్తుల సహకారంతో బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్లు ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ డైరెక్టర్లు, సభ్యులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News