మల్లన్న ఆశీస్సులతో విజయం – మొక్కు తీర్చుకున్న కునూరి మహేష్ గౌడ్
మల్లన్న ఆశీస్సులతో విజయం – మొక్కు తీర్చుకున్న కునూరి మహేష్ గౌడ్
స్థానికం బృందం
యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని నిదానపల్లి గ్రామంలో మల్లన్న గుట్టపై స్వయంభూగా వెలసిన శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి ఆలయం భక్తిరసంతో కళకళలాడింది. డిసెంబర్లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్గా కూనూరు సాయికుమార్ గౌడ్ గెలిస్తే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో స్వామివారికి ప్రత్యేక సేవలు నిర్వహిస్తానని మొక్కుకున్న కునూరి మహేష్ గౌడ్ తన మాట నిలబెట్టుకున్నారు.
ఎన్నికల్లో సాయికుమార్ గౌడ్ అత్యధిక మెజార్టీతో విజయం సాధించడంతో, గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులతో కలిసి మహేష్ గౌడ్ ఘనంగా ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు, అభిషేకాలు, సేవలను నిర్వహించారు. శివరాత్రి వేళ ఆలయం వద్ద భక్తుల రద్దీ ఉధృతంగా కనిపించింది. మంత్రోచ్చారణల నడుమ జరిగిన సేవలు ఆధ్యాత్మిక వాతావరణాన్ని మరింత గంభీరంగా మలిచాయి.
ఈ సందర్భంగా సర్పంచ్ కూనూరు సాయికుమార్ గౌడ్ మాట్లాడుతూ, “మల్లన్న స్వామి కోరిన కోరికలు తీర్చే దైవం. స్వామివారి కృపా కటాక్షాలతోనే ఈ విజయాన్ని సాధించగలిగాం. గ్రామ అభివృద్ధికి కట్టుబడి పని చేస్తాం” అని స్పష్టం చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి