Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
విద్యార్థుల ప్రాథమిక నైపుణ్యాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి: జిల్లా కలెక్టర్ “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 29, 2026 09:55 PM

మల్లన్న ఆశీస్సులతో విజయం – మొక్కు తీర్చుకున్న కునూరి మహేష్ గౌడ్

మల్లన్న ఆశీస్సులతో విజయం – మొక్కు తీర్చుకున్న కునూరి మహేష్ గౌడ్

మల్లన్న ఆశీస్సులతో విజయం – మొక్కు తీర్చుకున్న కునూరి  మహేష్ గౌడ్
18-02-2026 362 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని నిదానపల్లి గ్రామంలో మల్లన్న గుట్టపై స్వయంభూగా వెలసిన శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి ఆలయం భక్తిరసంతో కళకళలాడింది. డిసెంబర్‌లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్‌గా కూనూరు సాయికుమార్ గౌడ్ గెలిస్తే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో స్వామివారికి ప్రత్యేక సేవలు నిర్వహిస్తానని మొక్కుకున్న కునూరి మహేష్ గౌడ్ తన మాట నిలబెట్టుకున్నారు.

ఎన్నికల్లో సాయికుమార్ గౌడ్ అత్యధిక మెజార్టీతో విజయం సాధించడంతో, గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులతో కలిసి మహేష్ గౌడ్ ఘనంగా ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు, అభిషేకాలు, సేవలను నిర్వహించారు. శివరాత్రి వేళ ఆలయం వద్ద భక్తుల రద్దీ ఉధృతంగా కనిపించింది. మంత్రోచ్చారణల నడుమ జరిగిన సేవలు ఆధ్యాత్మిక వాతావరణాన్ని మరింత గంభీరంగా మలిచాయి.

ఈ సందర్భంగా సర్పంచ్ కూనూరు సాయికుమార్ గౌడ్ మాట్లాడుతూ, “మల్లన్న స్వామి కోరిన కోరికలు తీర్చే దైవం. స్వామివారి కృపా కటాక్షాలతోనే ఈ విజయాన్ని సాధించగలిగాం. గ్రామ అభివృద్ధికి కట్టుబడి పని చేస్తాం” అని స్పష్టం చేశారు.

Sthanikam

మల్లన్న ఆశీస్సులతో విజయం – మొక్కు తీర్చుకున్న కునూరి మహేష్ గౌడ్

Article Image

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని నిదానపల్లి గ్రామంలో మల్లన్న గుట్టపై స్వయంభూగా వెలసిన శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి ఆలయం భక్తిరసంతో కళకళలాడింది. డిసెంబర్‌లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్‌గా కూనూరు సాయికుమార్ గౌడ్ గెలిస్తే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో స్వామివారికి ప్రత్యేక సేవలు నిర్వహిస్తానని మొక్కుకున్న కునూరి మహేష్ గౌడ్ తన మాట నిలబెట్టుకున్నారు.

ఎన్నికల్లో సాయికుమార్ గౌడ్ అత్యధిక మెజార్టీతో విజయం సాధించడంతో, గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులతో కలిసి మహేష్ గౌడ్ ఘనంగా ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు, అభిషేకాలు, సేవలను నిర్వహించారు. శివరాత్రి వేళ ఆలయం వద్ద భక్తుల రద్దీ ఉధృతంగా కనిపించింది. మంత్రోచ్చారణల నడుమ జరిగిన సేవలు ఆధ్యాత్మిక వాతావరణాన్ని మరింత గంభీరంగా మలిచాయి.

ఈ సందర్భంగా సర్పంచ్ కూనూరు సాయికుమార్ గౌడ్ మాట్లాడుతూ, “మల్లన్న స్వామి కోరిన కోరికలు తీర్చే దైవం. స్వామివారి కృపా కటాక్షాలతోనే ఈ విజయాన్ని సాధించగలిగాం. గ్రామ అభివృద్ధికి కట్టుబడి పని చేస్తాం” అని స్పష్టం చేశారు.

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News