మళ్ళీ కదనరంగంలోకి కేసీఆర్! నీళ్ల కోసం కొత్త ఉద్యమం షురూ.. రాష్ట్ర రాజకీయాల్లో పెరిగిన హీట్
మళ్ళీ కదనరంగంలోకి కేసీఆర్! నీళ్ల కోసం కొత్త ఉద్యమం షురూ.. రాష్ట్ర రాజకీయాల్లో పెరిగిన హీట్
Chanikya Madhu
హైదరాబాద్, స్థానికం న్యూస్: తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. కొంతకాలంగా మౌనంగా ఉన్న గులాబీ బాస్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మళ్ళీ యాక్షన్ మోడ్లోకి వచ్చారు. తెలంగాణ నీటి హక్కుల విషయంలో రాజీపడేదే లేదని, ప్రభుత్వం తీరుకు నిరసనగా మరో "మహా ఉద్యమానికి" శ్రీకారం చుట్టబోతున్నట్లు ప్రకటించారు.
నీళ్ల కోసం లడాయి.. కృష్ణా జలాల పంపిణీలో జరుగుతున్న అన్యాయంపై కేసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాజెక్టుల నిర్వహణను బోర్డులకు (KRMB) అప్పగించడం అంటే తెలంగాణ రైతుల గొంతు కోయడమేనని ఆయన మండిపడ్డారు. "తెలంగాణ తెచ్చుకున్నదే నీళ్లు, నిధులు, నియామకాల కోసం. ఇప్పుడు ఆ నీళ్లే పోతుంటే చూస్తూ ఊరుకోం" అని కేసీఆర్ హెచ్చరించారు.
నల్గొండ నుంచే సమరశంఖం? ఈ ఉద్యమానికి నాందిగా త్వరలోనే నల్గొండ జిల్లాలో భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. గతంలో ఉద్యమ సమయంలో ఎలాంటి జోష్ ఉందో, అదే స్పిరిట్తో ప్రజల్లోకి వెళ్లాలని కేసీఆర్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. "నాగార్జున సాగర్ ఆయకట్టు ఎండిపోతుంటే ప్రభుత్వం ఏం చేస్తోంది?" అని ఆయన ప్రశ్నించారు.
ప్రభుత్వానికి డెడ్లైన్.. నీటి వాటాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని, లేదంటే ప్రజలతో కలిసి రోడ్లెక్కి పోరాడుతామని కేసీఆర్ అల్టిమేటం జారీ చేశారు. దీంతో ఇన్నాళ్లు స్తబ్దుగా ఉన్న బీఆర్ఎస్ క్యాడర్లో కొత్త ఉత్సాహం నెలకొంది. మొత్తానికి కేసీఆర్ రీ-ఎంట్రీతో పార్లమెంట్ ఎన్నికల ముందు తెలంగాణ రాజకీయం రసవత్తరంగా మారింది.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి