Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: March 14, 2026 10:52 AM

మాజీ కేంద్రమంత్రి కావూరి సాంబశివరావు కన్నుమూత

మాజీ కేంద్రమంత్రి కావూరి సాంబశివరావు కన్నుమూత

మాజీ కేంద్రమంత్రి కావూరి సాంబశివరావు కన్నుమూత
March 09, 2026 04:48 PM 37 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

మాజీ కేంద్రమంత్రి కావూరి సాంబశివరావు సోమవారం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి రాజకీయ వర్గాల్లో తీవ్ర విషాదాన్ని కలిగించింది.

పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన కావూరి సాంబశివరావు ప్రముఖ పారిశ్రామికవేత్తగా, సీనియర్ రాజకీయ నాయకుడిగా గుర్తింపు పొందారు. ఆయన పలుమార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికై ప్రజలకు సేవలందించారు. కేంద్రంలో మాజీ ప్రధాని మన్నామోహన్ సింగ్ నాయకత్వంలోని ప్రభుత్వంలో జౌళి శాఖ మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహించారు.

కావూరి సాంబశివరావు మృతి పట్ల పలువురు రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ఆయన సేవలను స్మరించుకున్నారు.

ఆయన మృతి రాష్ట్ర రాజకీయాలకు తీరని లోటని పలువురు అభిప్రాయపడ్డారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News