Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 04:02 AM

మాజీ కేంద్రమంత్రి కావూరి సాంబశివరావు కన్నుమూత

మాజీ కేంద్రమంత్రి కావూరి సాంబశివరావు కన్నుమూత

మాజీ కేంద్రమంత్రి కావూరి సాంబశివరావు కన్నుమూత
March 09, 2026 04:48 PM 54 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

మాజీ కేంద్రమంత్రి కావూరి సాంబశివరావు సోమవారం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి రాజకీయ వర్గాల్లో తీవ్ర విషాదాన్ని కలిగించింది.

పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన కావూరి సాంబశివరావు ప్రముఖ పారిశ్రామికవేత్తగా, సీనియర్ రాజకీయ నాయకుడిగా గుర్తింపు పొందారు. ఆయన పలుమార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికై ప్రజలకు సేవలందించారు. కేంద్రంలో మాజీ ప్రధాని మన్నామోహన్ సింగ్ నాయకత్వంలోని ప్రభుత్వంలో జౌళి శాఖ మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహించారు.

కావూరి సాంబశివరావు మృతి పట్ల పలువురు రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ఆయన సేవలను స్మరించుకున్నారు.

ఆయన మృతి రాష్ట్ర రాజకీయాలకు తీరని లోటని పలువురు అభిప్రాయపడ్డారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News