Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఉద్యోగుల డిమాండ్లపై మహాధర్నా అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 28, 2026 11:24 AM

మహాశివరాత్రికి శ్రీశైలంలో ఉచిత బస్సులు

మహాశివరాత్రికి శ్రీశైలంలో ఉచిత బస్సులు

మహాశివరాత్రికి శ్రీశైలంలో ఉచిత బస్సులు
08-02-2026 185 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భక్తుల రద్దీకి అనుగుణంగా ప్రత్యేకంగా నిర్వహణ

శ్రీశైల దేవస్థానంలో జరుగుతున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా వేలాది మంది భక్తులు క్షేత్రానికి చేరుకుంటుండటంతో భక్తుల సౌకర్యార్థం దేవస్థానం ఉచిత బస్సు సదుపాయాన్ని ఏర్పాటు చేసింది.భక్తులు దిగిన ప్రదేశాల నుంచి దర్శన ప్రాంతాలకు సులభంగా చేరుకునేలా కైలాసద్వారం నుంచి శ్రీశైలం వరకు ఉచిత బస్సులు నడపబడుతున్నాయి. అదేవిధంగా నందిగుడి సర్కిల్ నుంచి ప్రారంభమై గణేశసదన్, సెంట్రల్ పార్కింగ్, విభూతిమఠం జంక్షన్, మల్లమ్మకన్నీరు, శివాజీ స్ఫూర్తి కేంద్రం, రుద్రాపార్కు, సిద్ధరామప్ప కొలను, పాతాళగంగ రోడ్డు, ప్రైవేటు సత్రాల మీదుగా తిరిగి నందిగుడి సర్కిల్‌కు చేరుకునేలా రూట్‌ను ఏర్పాటు చేశారు.భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఫిబ్రవరి 8, 9 తేదీలలో నాలుగు బస్సులు, ఫిబ్రవరి 10, 11 తేదీలలో రోజుకు ఎనిమిది బస్సులు, ఫిబ్రవరి 12 నుంచి 16 తేదీల వరకు రోజుకు పది బస్సులను నడపనున్నట్లు దేవస్థానం అధికారులు తెలిపారు. భక్తులు ఈ ఉచిత బస్సు సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు

Sthanikam

మహాశివరాత్రికి శ్రీశైలంలో ఉచిత బస్సులు

Article Image

భక్తుల రద్దీకి అనుగుణంగా ప్రత్యేకంగా నిర్వహణ

శ్రీశైల దేవస్థానంలో జరుగుతున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా వేలాది మంది భక్తులు క్షేత్రానికి చేరుకుంటుండటంతో భక్తుల సౌకర్యార్థం దేవస్థానం ఉచిత బస్సు సదుపాయాన్ని ఏర్పాటు చేసింది.భక్తులు దిగిన ప్రదేశాల నుంచి దర్శన ప్రాంతాలకు సులభంగా చేరుకునేలా కైలాసద్వారం నుంచి శ్రీశైలం వరకు ఉచిత బస్సులు నడపబడుతున్నాయి. అదేవిధంగా నందిగుడి సర్కిల్ నుంచి ప్రారంభమై గణేశసదన్, సెంట్రల్ పార్కింగ్, విభూతిమఠం జంక్షన్, మల్లమ్మకన్నీరు, శివాజీ స్ఫూర్తి కేంద్రం, రుద్రాపార్కు, సిద్ధరామప్ప కొలను, పాతాళగంగ రోడ్డు, ప్రైవేటు సత్రాల మీదుగా తిరిగి నందిగుడి సర్కిల్‌కు చేరుకునేలా రూట్‌ను ఏర్పాటు చేశారు.భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఫిబ్రవరి 8, 9 తేదీలలో నాలుగు బస్సులు, ఫిబ్రవరి 10, 11 తేదీలలో రోజుకు ఎనిమిది బస్సులు, ఫిబ్రవరి 12 నుంచి 16 తేదీల వరకు రోజుకు పది బస్సులను నడపనున్నట్లు దేవస్థానం అధికారులు తెలిపారు. భక్తులు ఈ ఉచిత బస్సు సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News