మహాశివరాత్రికి శ్రీశైలంలో ఉచిత బస్సులు
మహాశివరాత్రికి శ్రీశైలంలో ఉచిత బస్సులు
Editor Desk
భక్తుల రద్దీకి అనుగుణంగా ప్రత్యేకంగా నిర్వహణ
శ్రీశైల దేవస్థానంలో జరుగుతున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా వేలాది మంది భక్తులు క్షేత్రానికి చేరుకుంటుండటంతో భక్తుల సౌకర్యార్థం దేవస్థానం ఉచిత బస్సు సదుపాయాన్ని ఏర్పాటు చేసింది.భక్తులు దిగిన ప్రదేశాల నుంచి దర్శన ప్రాంతాలకు సులభంగా చేరుకునేలా కైలాసద్వారం నుంచి శ్రీశైలం వరకు ఉచిత బస్సులు నడపబడుతున్నాయి. అదేవిధంగా నందిగుడి సర్కిల్ నుంచి ప్రారంభమై గణేశసదన్, సెంట్రల్ పార్కింగ్, విభూతిమఠం జంక్షన్, మల్లమ్మకన్నీరు, శివాజీ స్ఫూర్తి కేంద్రం, రుద్రాపార్కు, సిద్ధరామప్ప కొలను, పాతాళగంగ రోడ్డు, ప్రైవేటు సత్రాల మీదుగా తిరిగి నందిగుడి సర్కిల్కు చేరుకునేలా రూట్ను ఏర్పాటు చేశారు.భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఫిబ్రవరి 8, 9 తేదీలలో నాలుగు బస్సులు, ఫిబ్రవరి 10, 11 తేదీలలో రోజుకు ఎనిమిది బస్సులు, ఫిబ్రవరి 12 నుంచి 16 తేదీల వరకు రోజుకు పది బస్సులను నడపనున్నట్లు దేవస్థానం అధికారులు తెలిపారు. భక్తులు ఈ ఉచిత బస్సు సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి