Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాల్యవివాహాలు చట్టరీత్యా నేరం: సర్పంచ్ శాపాక లింగస్వామి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 06:54 PM

మైనారిటీ పథకాల దరఖాస్తులకు మళ్లీ గ్రీన్ సిగ్నల్ జనవరి 10 వరకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు అవకాశం

మైనారిటీ పథకాల దరఖాస్తులకు మళ్లీ గ్రీన్ సిగ్నల్ జనవరి 10 వరకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు అవకాశం

మైనారిటీ పథకాల దరఖాస్తులకు మళ్లీ గ్రీన్ సిగ్నల్ జనవరి 10 వరకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు అవకాశం
January 05, 2026 07:42 PM 212 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
స్థానికం ప్రతినిధి

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మైనారిటీల సంక్షేమం, ఆర్థిక భద్రత లక్ష్యంగా ప్రవేశపెట్టిన “రేవంత్ అన్నకా సహారా – మిస్కీనో కే లియే”, “ఇందిరమ్మ మైనారిటీ మహిళా యోజన” పథకాలకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణను మళ్లీ ప్రారంభించినట్లు జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి ఎం. జయమ్మ వెల్లడించారు.

సాధారణ ఎన్నికల కోడ్ కారణంగా 2025 సెప్టెంబర్ 29 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ నిలిచిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పెద్ద సంఖ్యలో పేద మైనారిటీ అభ్యర్థులు ప్రయోజనాలు పొందలేకపోయారని, వారి నుంచి వచ్చిన భారీ అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకుని తెలంగాణ మైనారిటీ ఆర్థిక సంస్థ, హైదరాబాద్ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌ను తిరిగి ప్రారంభించినట్లు తెలిపారు.

అర్హత కలిగిన మైనారిటీ అభ్యర్థులు 2026 జనవరి 5 ఉదయం 10.30 గంటల నుంచి జనవరి 10 రాత్రి 11.59 గంటల వరకు

https://tgobmms.cgg.gov.in పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. దరఖాస్తు ఫారంతో పాటు అవసరమైన ధ్రువీకరణ పత్రాలను సంబంధిత మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సమర్పించాలని సూచించారు. ప్రతిరోజూ సాయంత్రం 5 గంటల లోపు దరఖాస్తులు నమోదు చేసుకోవచ్చని తెలిపారు.

మరిన్ని వివరాల కోసం మైనారిటీ సంక్షేమ శాఖ కార్యాలయం, రూమ్ నెం. F-16, మొదటి అంతస్తు, కలెక్టర్ కార్యాలయం, రాయగిరి – భువనగిరి లేదా 95056 40004 నంబర్‌ను సంప్రదించాలని జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి ఎం. జయమ్మ సూచించారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News