Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 04:20 AM

మైనారిటీ పథకాల దరఖాస్తులకు మళ్లీ గ్రీన్ సిగ్నల్ జనవరి 10 వరకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు అవకాశం

మైనారిటీ పథకాల దరఖాస్తులకు మళ్లీ గ్రీన్ సిగ్నల్ జనవరి 10 వరకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు అవకాశం

మైనారిటీ పథకాల దరఖాస్తులకు మళ్లీ గ్రీన్ సిగ్నల్ జనవరి 10 వరకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు అవకాశం
January 05, 2026 07:42 PM 220 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
స్థానికం ప్రతినిధి

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మైనారిటీల సంక్షేమం, ఆర్థిక భద్రత లక్ష్యంగా ప్రవేశపెట్టిన “రేవంత్ అన్నకా సహారా – మిస్కీనో కే లియే”, “ఇందిరమ్మ మైనారిటీ మహిళా యోజన” పథకాలకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణను మళ్లీ ప్రారంభించినట్లు జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి ఎం. జయమ్మ వెల్లడించారు.

సాధారణ ఎన్నికల కోడ్ కారణంగా 2025 సెప్టెంబర్ 29 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ నిలిచిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పెద్ద సంఖ్యలో పేద మైనారిటీ అభ్యర్థులు ప్రయోజనాలు పొందలేకపోయారని, వారి నుంచి వచ్చిన భారీ అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకుని తెలంగాణ మైనారిటీ ఆర్థిక సంస్థ, హైదరాబాద్ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌ను తిరిగి ప్రారంభించినట్లు తెలిపారు.

అర్హత కలిగిన మైనారిటీ అభ్యర్థులు 2026 జనవరి 5 ఉదయం 10.30 గంటల నుంచి జనవరి 10 రాత్రి 11.59 గంటల వరకు

https://tgobmms.cgg.gov.in పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. దరఖాస్తు ఫారంతో పాటు అవసరమైన ధ్రువీకరణ పత్రాలను సంబంధిత మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సమర్పించాలని సూచించారు. ప్రతిరోజూ సాయంత్రం 5 గంటల లోపు దరఖాస్తులు నమోదు చేసుకోవచ్చని తెలిపారు.

మరిన్ని వివరాల కోసం మైనారిటీ సంక్షేమ శాఖ కార్యాలయం, రూమ్ నెం. F-16, మొదటి అంతస్తు, కలెక్టర్ కార్యాలయం, రాయగిరి – భువనగిరి లేదా 95056 40004 నంబర్‌ను సంప్రదించాలని జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి ఎం. జయమ్మ సూచించారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News