లోపాలకు తావులేదు – రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి స్పష్టం
లోపాలకు తావులేదు – రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి స్పష్టం
స్థానికం బృందం
ప్రత్యేక సమగ్ర సవరణలో మ్యాపింగ్కు గట్టి ఆదేశాలు
హైదరాబాద్
ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా జరుగుతున్న మ్యాపింగ్ ప్రక్రియను అత్యంత కట్టుదిట్టంగా చేపట్టాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. భారత ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో అమలవుతున్న ఈ కార్యక్రమం ఎన్నికల వ్యవస్థలో కీలకమైనదని పేర్కొన్నారు.శనివారం హైదరాబాద్ నుండి వీడియో సమావేశం ద్వారా జిల్లాల కలెక్టర్లు, ఎన్నికల అధికారులు, ఎన్నికల నమోదు అధికారులతో మ్యాపింగ్ ప్రక్రియపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బూత్ స్థాయి అధికారులు తప్పనిసరిగా ఇంటింటికి వెళ్లి క్షేత్రస్థాయిలో మ్యాపింగ్ పూర్తి చేయాలని, దీనిలో నిర్లక్ష్యం ఉండరాదని హెచ్చరించారు.మ్యాపింగ్ వేగవంతం చేసేందుకు గ్రామ పాలన అధికారులు, ఇతర సిబ్బందిని సహాయకులుగా నియమించాలని, బూత్ స్థాయి అధికారులకు పూర్తి స్థాయి సహకారం అందించాలని ఆదేశించారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో సమన్వయం పెంచి బూత్ స్థాయి ఏజెంట్ల నియామకంపై అవగాహన కల్పించాలని సూచించారు.
బూత్ స్థాయి అధికారులు క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యటిస్తూ మ్యాపింగ్ నిర్వహించాలని, వారి పర్యవేక్షకులు, సహాయ ఎన్నికల నమోదు అధికారులు దగ్గరుండి పర్యవేక్షించాలని తెలిపారు. నలభై సంవత్సరాల లోపు మహిళల మ్యాపింగ్ను తల్లిదండ్రుల వివరాల ఆధారంగా నిర్వహించాలని స్పష్టం చేశారు.
పెండింగ్లో ఉన్న దరఖాస్తులను తక్షణమే పరిష్కరించాలని, అస్పష్టమైన ఫోటోలు, పునరావృత నమోదులపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. బూత్ స్థాయి అధికారుల వివరాలు ప్రజలకు స్పష్టంగా తెలిసేలా విస్తృత ప్రచారం నిర్వహించాలని తెలిపారు.
ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ హనుమంత రావు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు, భువనగిరి రెవెన్యూ డివిజనల్ అధికారి కృష్ణారెడ్డి, ఎన్నికల విభాగ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి