Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మండల కాంగ్రెస్ అధ్యక్షుల నియామకాలపై ఎలాంటి మార్పు లేదు; ఎమ్మెల్యే సామెల్ తెలంగాణ పోలీసు క్రీడల్లో మూడు విభాగాల్లో కాంస్య పతకాలు సాధించి నల్లగొండ ఖ్యాతిని నిలబెట్టిన షకీర్ మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 11:26 AM

కృష్ణవేణి టాలెంట్ స్కూల్‌లో ఘనంగా స్వపరిపాలన దినోత్సవం

కృష్ణవేణి టాలెంట్ స్కూల్‌లో ఘనంగా స్వపరిపాలన దినోత్సవం

కృష్ణవేణి టాలెంట్ స్కూల్‌లో ఘనంగా స్వపరిపాలన దినోత్సవం
January 31, 2026 03:42 PM 62 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

మండల కేంద్రంలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్‌లో శనివారం స్వపరిపాలన దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయులు, పరిపాలనా అధికారులు వంటి వివిధ పాత్రలు పోషిస్తూ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

ఉపాధ్యాయుల పాత్రలో ఉన్న విద్యార్థులు తరగతి గదుల్లో తమ తోటి విద్యార్థులకు పాఠ్యాంశాలను బోధిస్తూ తమ ప్రతిభా నైపుణ్యాలను చాటారు. అలాగే పరిపాలనా వ్యవస్థ పనితీరును ప్రతిబింబించేలా అధికారులు పాత్రల్లో విద్యార్థులు చురుగ్గా పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌గా రింషా సదాఫ్, ఉప జిల్లా కలెక్టర్‌గా కె. గీతాంజలి, జిల్లా విద్యాశాఖాధికారిగా ఉమేమా బుస్రా, ఉప జిల్లా విద్యాశాఖాధికారిగా అంతుల్ హాది, మండల విద్యాశాఖాధికారిగా బి. ప్రతీక్ చారి, మండల రెవెన్యూ అధికారిగా ఎన్. జస్వంత్, పాఠశాల కరెస్పాండెంట్‌గా ఎం. రిషిత, ప్రధానోపాధ్యాయురాలిగా బి. చైత్ర విద్యార్థులు తమ పాత్రలను సమర్థవంతంగా నిర్వహించారు.అనంతరం జరిగిన సమావేశంలో పాఠశాల కరెస్పాండెంట్ గంగుల నరేందర్ రెడ్డి, ప్రధానోపాధ్యాయుడు బి. యాదగిరి, అకాడమిక్ డైరెక్టర్ జె.వి.ఎన్.ఎస్. మణి ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులు అందజేసి అభినందించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు రషీద్, మురళి, శ్రీనివాస్, మల్లేష్, అలీం, సత్తయ్య, ఉమారాణి, మహాలక్ష్మి, పూనం దాస్, వినోద, లావణ్య, ఫారియా, విజయలక్ష్మి, కరుణ, కళ్యాణి, శ్వేతా, మమత, శ్రీలత, సంధ్య, మాధవి, ఎస్. ఉమారాణి, టి. లావణ్య, రేణుక, కవిత, అనూష, నజియా, సరిత తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News