కోవాబన్ వలి వివక్ష ఘటనపై జగన్ మౌనం — మైనారిటీ సమితి ఆవేదన
కోవాబన్ వలి వివక్ష ఘటనపై జగన్ మౌనం — మైనారిటీ సమితి ఆవేదన
Editor Desk
ఆదోని ప్రతినిధి,
మేడారం జాతరలో నంద్యాల జిల్లా వాసి, పేద కోవాబన్ వ్యాపారి వలి పై జరిగిన మత వివక్ష ఘటనపై మాజీ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహనరెడ్డి స్పందించకపోవడం బాధాకరమని మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కార్యదర్శి ఎ. నూర్ అహ్మద్ ఆవేదన వ్యక్తం చేశారు.
జాతర సందర్భంగా కొందరు యూట్యూబర్లు వలి పేదరికాన్ని, మతాన్ని కించపరిచేలా వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఘటనపై సభ్య సమాజం తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తోందన్నారు. ఈ సందర్భంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఎక్స్ వేదికగా బాధితుడిని ఓదార్చడం అభినందనీయమని పేర్కొన్నారు.
అలాగే ఉర్దూ అకాడమీ చైర్మన్ ఫరూక్ షుబ్లీ బాధితుడిని తన వెంట తీసుకెళ్లి సంబంధిత మంత్రులతో మాట్లాడించి సహాయం అందించారని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తోందని, మైనారిటీలకు అండగా ఉంటోందని సమితి అభిప్రాయపడింది.
అయితే ఈ ఘటనపై వైసీపీ అధినేత వై ఎస్ జగన్మోహనరెడ్డి మౌనం వహించడం శోచనీయమని, జరుగుతున్న పరిణామాలను సమాజం గమనిస్తోందని పేర్కొన్నారు. ఇప్పటికైనా ఆయన స్పందించాలని కోరారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి