Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కుల వివక్ష ఆరోపణలతో చండూరు పోలీస్ స్టేషన్ ఎదుట కాంగ్రెస్ ధర్నా ఎస్సైపై చర్యలు తీసుకోవాలని డిమాండ్.. తెలంగాణ పోలీసు క్రీడల్లో మూడు విభాగాల్లో కాంస్య పతకాలు సాధించి నల్లగొండ ఖ్యాతిని నిలబెట్టిన షకీర్ మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 02:32 PM

కోవాబన్ వలి వివక్ష ఘటనపై జగన్ మౌనం — మైనారిటీ సమితి ఆవేదన

కోవాబన్ వలి వివక్ష ఘటనపై జగన్ మౌనం — మైనారిటీ సమితి ఆవేదన

కోవాబన్ వలి వివక్ష ఘటనపై జగన్ మౌనం — మైనారిటీ సమితి ఆవేదన
February 19, 2026 08:10 PM 37 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఆదోని ప్రతినిధి,

మేడారం జాతరలో నంద్యాల జిల్లా వాసి, పేద కోవాబన్ వ్యాపారి వలి పై జరిగిన మత వివక్ష ఘటనపై మాజీ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహనరెడ్డి స్పందించకపోవడం బాధాకరమని మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కార్యదర్శి ఎ. నూర్ అహ్మద్ ఆవేదన వ్యక్తం చేశారు.

జాతర సందర్భంగా కొందరు యూట్యూబర్లు వలి పేదరికాన్ని, మతాన్ని కించపరిచేలా వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఘటనపై సభ్య సమాజం తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తోందన్నారు. ఈ సందర్భంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఎక్స్ వేదికగా బాధితుడిని ఓదార్చడం అభినందనీయమని పేర్కొన్నారు.

అలాగే ఉర్దూ అకాడమీ చైర్మన్ ఫరూక్ షుబ్లీ బాధితుడిని తన వెంట తీసుకెళ్లి సంబంధిత మంత్రులతో మాట్లాడించి సహాయం అందించారని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తోందని, మైనారిటీలకు అండగా ఉంటోందని సమితి అభిప్రాయపడింది.

అయితే ఈ ఘటనపై వైసీపీ అధినేత వై ఎస్ జగన్మోహనరెడ్డి మౌనం వహించడం శోచనీయమని, జరుగుతున్న పరిణామాలను సమాజం గమనిస్తోందని పేర్కొన్నారు. ఇప్పటికైనా ఆయన స్పందించాలని కోరారు.


మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News