Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గుడి బండలా మారిన గ్యాస్ బండి… క్యూలో నిల్చొని అలసిపోయిన వినియోగదారులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 10:39 AM

కోవాబన్ వలి వివక్ష ఘటనపై జగన్ మౌనం — మైనారిటీ సమితి ఆవేదన

కోవాబన్ వలి వివక్ష ఘటనపై జగన్ మౌనం — మైనారిటీ సమితి ఆవేదన

కోవాబన్ వలి వివక్ష ఘటనపై జగన్ మౌనం — మైనారిటీ సమితి ఆవేదన
February 19, 2026 08:10 PM 29 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఆదోని ప్రతినిధి,

మేడారం జాతరలో నంద్యాల జిల్లా వాసి, పేద కోవాబన్ వ్యాపారి వలి పై జరిగిన మత వివక్ష ఘటనపై మాజీ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహనరెడ్డి స్పందించకపోవడం బాధాకరమని మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కార్యదర్శి ఎ. నూర్ అహ్మద్ ఆవేదన వ్యక్తం చేశారు.

జాతర సందర్భంగా కొందరు యూట్యూబర్లు వలి పేదరికాన్ని, మతాన్ని కించపరిచేలా వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఘటనపై సభ్య సమాజం తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తోందన్నారు. ఈ సందర్భంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఎక్స్ వేదికగా బాధితుడిని ఓదార్చడం అభినందనీయమని పేర్కొన్నారు.

అలాగే ఉర్దూ అకాడమీ చైర్మన్ ఫరూక్ షుబ్లీ బాధితుడిని తన వెంట తీసుకెళ్లి సంబంధిత మంత్రులతో మాట్లాడించి సహాయం అందించారని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తోందని, మైనారిటీలకు అండగా ఉంటోందని సమితి అభిప్రాయపడింది.

అయితే ఈ ఘటనపై వైసీపీ అధినేత వై ఎస్ జగన్మోహనరెడ్డి మౌనం వహించడం శోచనీయమని, జరుగుతున్న పరిణామాలను సమాజం గమనిస్తోందని పేర్కొన్నారు. ఇప్పటికైనా ఆయన స్పందించాలని కోరారు.


మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News