Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
విద్యార్థుల ప్రాథమిక నైపుణ్యాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి: జిల్లా కలెక్టర్ “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 30, 2026 03:08 AM

కోవాబన్ వలి వివక్ష ఘటనపై జగన్ మౌనం — మైనారిటీ సమితి ఆవేదన

కోవాబన్ వలి వివక్ష ఘటనపై జగన్ మౌనం — మైనారిటీ సమితి ఆవేదన

కోవాబన్ వలి వివక్ష ఘటనపై జగన్ మౌనం — మైనారిటీ సమితి ఆవేదన
19-02-2026 43 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఆదోని ప్రతినిధి,

మేడారం జాతరలో నంద్యాల జిల్లా వాసి, పేద కోవాబన్ వ్యాపారి వలి పై జరిగిన మత వివక్ష ఘటనపై మాజీ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహనరెడ్డి స్పందించకపోవడం బాధాకరమని మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కార్యదర్శి ఎ. నూర్ అహ్మద్ ఆవేదన వ్యక్తం చేశారు.

జాతర సందర్భంగా కొందరు యూట్యూబర్లు వలి పేదరికాన్ని, మతాన్ని కించపరిచేలా వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఘటనపై సభ్య సమాజం తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తోందన్నారు. ఈ సందర్భంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఎక్స్ వేదికగా బాధితుడిని ఓదార్చడం అభినందనీయమని పేర్కొన్నారు.

అలాగే ఉర్దూ అకాడమీ చైర్మన్ ఫరూక్ షుబ్లీ బాధితుడిని తన వెంట తీసుకెళ్లి సంబంధిత మంత్రులతో మాట్లాడించి సహాయం అందించారని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తోందని, మైనారిటీలకు అండగా ఉంటోందని సమితి అభిప్రాయపడింది.

అయితే ఈ ఘటనపై వైసీపీ అధినేత వై ఎస్ జగన్మోహనరెడ్డి మౌనం వహించడం శోచనీయమని, జరుగుతున్న పరిణామాలను సమాజం గమనిస్తోందని పేర్కొన్నారు. ఇప్పటికైనా ఆయన స్పందించాలని కోరారు.


Sthanikam

కోవాబన్ వలి వివక్ష ఘటనపై జగన్ మౌనం — మైనారిటీ సమితి ఆవేదన

Article Image

ఆదోని ప్రతినిధి,

మేడారం జాతరలో నంద్యాల జిల్లా వాసి, పేద కోవాబన్ వ్యాపారి వలి పై జరిగిన మత వివక్ష ఘటనపై మాజీ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహనరెడ్డి స్పందించకపోవడం బాధాకరమని మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కార్యదర్శి ఎ. నూర్ అహ్మద్ ఆవేదన వ్యక్తం చేశారు.

జాతర సందర్భంగా కొందరు యూట్యూబర్లు వలి పేదరికాన్ని, మతాన్ని కించపరిచేలా వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఘటనపై సభ్య సమాజం తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తోందన్నారు. ఈ సందర్భంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఎక్స్ వేదికగా బాధితుడిని ఓదార్చడం అభినందనీయమని పేర్కొన్నారు.

అలాగే ఉర్దూ అకాడమీ చైర్మన్ ఫరూక్ షుబ్లీ బాధితుడిని తన వెంట తీసుకెళ్లి సంబంధిత మంత్రులతో మాట్లాడించి సహాయం అందించారని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తోందని, మైనారిటీలకు అండగా ఉంటోందని సమితి అభిప్రాయపడింది.

అయితే ఈ ఘటనపై వైసీపీ అధినేత వై ఎస్ జగన్మోహనరెడ్డి మౌనం వహించడం శోచనీయమని, జరుగుతున్న పరిణామాలను సమాజం గమనిస్తోందని పేర్కొన్నారు. ఇప్పటికైనా ఆయన స్పందించాలని కోరారు.


మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News