కౌంటింగ్లో చిన్న పొరపాటు కూడా సహించం. కలెక్టర్ హనుమంతరావు
కౌంటింగ్లో చిన్న పొరపాటు కూడా సహించం. కలెక్టర్ హనుమంతరావు
స్థానికం బృందం
పారదర్శకతే ప్రాధాన్యం – అధికారులకు కలెక్టర్ హనుమంతరావు గట్టి హెచ్చరిక
భువనగిరి:
మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో ఎలాంటి అలక్ష్యం, అవ్యవస్థకు తావులేకుండా పూర్తిస్థాయి పారదర్శకతతో వ్యవహరించాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అధికారులను కఠినంగా ఆదేశించారు. కౌంటింగ్ అనేది ఎన్నికలలో అత్యంత కీలక దశ అని స్పష్టం చేశారు.
గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న అధికారులకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలను అక్షరశః పాటించాలని, రూల్ 56 ప్రకారం మొదట పోస్టల్ బ్యాలెట్లను లెక్కించాల్సి ఉంటుందని తెలిపారు. యాక్ట్ 212 ప్రకారం సీక్రెసీ మెయింటెనెన్స్ నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలని స్పష్టం చేశారు.
ప్రతి బ్యాలెట్ పేపర్ను కౌంటింగ్ ఏజెంట్లకు స్పష్టంగా చూపించి, సంబంధిత పీజియన్ హోల్ సీల్ ట్రేలో వేయాలని ఆదేశించారు. ఎటువంటి సందేహాలకు తావులేకుండా విధులు నిర్వహించాలని, ప్రతి దశలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. “కౌంటింగ్లో చిన్న తప్పిదం కూడా పెద్ద వివాదాలకు దారి తీస్తుంది” అని హెచ్చరించారు.
అదనపు కలెక్టర్ భాస్కర్ రావు మాట్లాడుతూ ప్రతి కౌంటింగ్ టేబుల్కు ఒక సూపర్వైజర్, ఇద్దరు అసిస్టెంట్లను నియమిస్తామని తెలిపారు. క్రమబద్ధమైన విధానంతో కౌంటింగ్ పూర్తి చేసి, నివేదికలను సమయానుకూలంగా సమర్పించాలని సూచించారు.ఈ శిక్షణలో ఆర్డీవో కృష్ణారెడ్డి, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి నాగిరెడ్డి, డీపీవో విష్ణువర్ధన్ రెడ్డి, మాస్టర్ ట్రైనర్లు నర్సిరెడ్డి, హరినాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి