Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాల్యవివాహాలు చట్టరీత్యా నేరం: సర్పంచ్ శాపాక లింగస్వామి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 06:50 PM

కొత్త పెన్షన్ దరఖాస్తులకు తాజా ధ్రువపత్రాలు తప్పనిసరి

కొత్త పెన్షన్ దరఖాస్తులకు తాజా ధ్రువపత్రాలు తప్పనిసరి

కొత్త పెన్షన్ దరఖాస్తులకు తాజా ధ్రువపత్రాలు తప్పనిసరి
February 21, 2026 07:29 PM 103 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

కొత్తగా పెన్షన్ కొరకు దరఖాస్తు చేయుటకు కావాల్సిన డాకుమెంట్స్ :

కొత్త సంవత్సరం 2026లో ప్రభుత్వ పెన్షన్ పథకాల కోసం దరఖాస్తు చేసుకునే వారు తప్పనిసరిగా తాజా ఆదాయం, కుల ధ్రువపత్రాలను సమర్పించాలని అధికార వర్గాలు సూచించాయి. గతంలో పొందిన ఆదాయం, కుల సర్టిఫికెట్లు ఉన్నవారు మీ సేవా కేంద్రానికి వెళ్లి పునరుద్ధరణ చేయించుకుని నవీకరించిన ప్రతులను తీసుకురావాలని స్పష్టం చేశారు.

అలాగే ఆధార్ నంబర్‌కు మొబైల్ నంబర్ లింక్ అయి ఉండడం తప్పనిసరి అని తెలిపారు. అవసరమైన పత్రాల జిరాక్స్ ప్రతులతో సచివాలయంలో సమర్పించి కొత్త పెన్షన్లకు ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు.

సాధారణంగా అవసరమైన పత్రాలు:

ఆధార్ జిరాక్స్ ప్రతులు

ఆధార్ హిస్టరీ

రేషన్ కార్డు

ఆదాయం సర్టిఫికెట్ (తాజా)

కుల సర్టిఫికెట్ (తాజా)

వితంతు పెన్షన్‌కు అదనంగా:

భర్త మరణ ధ్రువపత్రం

ఒంటరి మహిళా పెన్షన్‌కు అదనంగా:

ప్రభుత్వ లేదా కోర్టు ద్వారా నిర్ధారించిన విడాకుల ధ్రువపత్రం

వృద్ధాప్య పెన్షన్‌కు అర్హత:

వయస్సు 60 సంవత్సరాలు పైబడినట్లు ధ్రువీకరణ

వికలాంగుల పెన్షన్‌కు అదనంగా:

ప్రభుత్వ వైద్యుల ద్వారా జారీ చేసిన సదరం ధ్రువపత్రం (వికలాంగత్వ నిర్ధారణ పత్రం)

అర్హులైన వారు అన్ని పత్రాలను సక్రమంగా సిద్ధం చేసుకుని సమీప గ్రామ/వార్డు సచివాలయానికి వెళ్లి దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులు సూచించారు.


మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News