Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 12:41 PM

*కూసుమంచి రామలింగేశ్వర ఆలయంలో శివరాత్రి ఏర్పాట్లకు కసరత్తు

*కూసుమంచి రామలింగేశ్వర ఆలయంలో శివరాత్రి ఏర్పాట్లకు కసరత్తు

*కూసుమంచి రామలింగేశ్వర ఆలయంలో శివరాత్రి ఏర్పాట్లకు కసరత్తు
02-02-2026 58 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

సమన్వయ సమావేశం, వాల్ పోస్టర్ ఆవిష్కరణ

మహాశివరాత్రి మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు కూసుమంచి శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో సమన్వయ సమావేశం జరిగింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పండుగ ఏర్పాట్లు పక్కాగా ఉండేలా అధికారులు, ఆలయ నిర్వాహకులు ప్రత్యేక చర్యలు చేపట్టాలని నిర్ణయించారు.

ఈ సమావేశానికి ఆలయ పునర్నిర్మాణ కర్త సాదు వీర ప్రతాపరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మండల రెవెన్యూ అధికారి, మండల అభివృద్ధి అధికారి, మండల వైద్యాధికారి, విద్యుత్ శాఖ అధికారులు, గ్రామ కార్యదర్శి, గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, శివ స్వాములు, భక్తులు, ఆలయ కార్యనిర్వహణ అధికారి, ఆలయ అర్చకులు, పత్రికా విలేకరులు సమావేశంలో పాల్గొన్నారు.శివరాత్రి రోజున భక్తుల రద్దీ అధికంగా ఉండే అవకాశం ఉన్నందున తగిన భద్రతా చర్యలు, వైద్య సదుపాయాలు, నిరంతర విద్యుత్ సరఫరా, పారిశుద్ధ్య ఏర్పాట్లు పటిష్టంగా ఉండాలని అధికారులకు సూచించారు. దర్శనాల సమయంలో క్రమశిక్షణ పాటించేలా ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు.సమన్వయ సమావేశం అనంతరం మహాశివరాత్రి పండుగను పురస్కరించుకుని దేవస్థానం ఆధ్వర్యంలో రూపొందించిన వాల్ పోస్టర్‌ను ఆలయ ప్రాంగణంలో ఘనంగా ఆవిష్కరించారు.

Sthanikam

*కూసుమంచి రామలింగేశ్వర ఆలయంలో శివరాత్రి ఏర్పాట్లకు కసరత్తు

Article Image

సమన్వయ సమావేశం, వాల్ పోస్టర్ ఆవిష్కరణ

మహాశివరాత్రి మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు కూసుమంచి శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో సమన్వయ సమావేశం జరిగింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పండుగ ఏర్పాట్లు పక్కాగా ఉండేలా అధికారులు, ఆలయ నిర్వాహకులు ప్రత్యేక చర్యలు చేపట్టాలని నిర్ణయించారు.

ఈ సమావేశానికి ఆలయ పునర్నిర్మాణ కర్త సాదు వీర ప్రతాపరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మండల రెవెన్యూ అధికారి, మండల అభివృద్ధి అధికారి, మండల వైద్యాధికారి, విద్యుత్ శాఖ అధికారులు, గ్రామ కార్యదర్శి, గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, శివ స్వాములు, భక్తులు, ఆలయ కార్యనిర్వహణ అధికారి, ఆలయ అర్చకులు, పత్రికా విలేకరులు సమావేశంలో పాల్గొన్నారు.శివరాత్రి రోజున భక్తుల రద్దీ అధికంగా ఉండే అవకాశం ఉన్నందున తగిన భద్రతా చర్యలు, వైద్య సదుపాయాలు, నిరంతర విద్యుత్ సరఫరా, పారిశుద్ధ్య ఏర్పాట్లు పటిష్టంగా ఉండాలని అధికారులకు సూచించారు. దర్శనాల సమయంలో క్రమశిక్షణ పాటించేలా ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు.సమన్వయ సమావేశం అనంతరం మహాశివరాత్రి పండుగను పురస్కరించుకుని దేవస్థానం ఆధ్వర్యంలో రూపొందించిన వాల్ పోస్టర్‌ను ఆలయ ప్రాంగణంలో ఘనంగా ఆవిష్కరించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News