*కూసుమంచి రామలింగేశ్వర ఆలయంలో శివరాత్రి ఏర్పాట్లకు కసరత్తు
*కూసుమంచి రామలింగేశ్వర ఆలయంలో శివరాత్రి ఏర్పాట్లకు కసరత్తు
స్థానికం బృందం
సమన్వయ సమావేశం, వాల్ పోస్టర్ ఆవిష్కరణ
మహాశివరాత్రి మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు కూసుమంచి శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో సమన్వయ సమావేశం జరిగింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పండుగ ఏర్పాట్లు పక్కాగా ఉండేలా అధికారులు, ఆలయ నిర్వాహకులు ప్రత్యేక చర్యలు చేపట్టాలని నిర్ణయించారు.
ఈ సమావేశానికి ఆలయ పునర్నిర్మాణ కర్త సాదు వీర ప్రతాపరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మండల రెవెన్యూ అధికారి, మండల అభివృద్ధి అధికారి, మండల వైద్యాధికారి, విద్యుత్ శాఖ అధికారులు, గ్రామ కార్యదర్శి, గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, శివ స్వాములు, భక్తులు, ఆలయ కార్యనిర్వహణ అధికారి, ఆలయ అర్చకులు, పత్రికా విలేకరులు సమావేశంలో పాల్గొన్నారు.శివరాత్రి రోజున భక్తుల రద్దీ అధికంగా ఉండే అవకాశం ఉన్నందున తగిన భద్రతా చర్యలు, వైద్య సదుపాయాలు, నిరంతర విద్యుత్ సరఫరా, పారిశుద్ధ్య ఏర్పాట్లు పటిష్టంగా ఉండాలని అధికారులకు సూచించారు. దర్శనాల సమయంలో క్రమశిక్షణ పాటించేలా ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు.సమన్వయ సమావేశం అనంతరం మహాశివరాత్రి పండుగను పురస్కరించుకుని దేవస్థానం ఆధ్వర్యంలో రూపొందించిన వాల్ పోస్టర్ను ఆలయ ప్రాంగణంలో ఘనంగా ఆవిష్కరించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి