Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఉచిత రేషన్ బియ్యం పంపిణీకి కేంద్రం నిర్ణయం మూడు నెలల సరఫరా… పేదలకు ఉపశమనం: అక్కెనపల్లి సైదులు సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 12:26 PM

కోడి పందేలపై ఉక్కుపాదం మోపండి ఉపకరణాలు, పందేల డబ్బును జప్తు చేయండి ఎక్కడ ఉల్లంఘనలు జరిగినా మీదే బాధ్యత జిల్లా కలెక్టర్లు, పోలీసు కమిషనర్లు, ఎస్పీలకు

కోడి పందేలపై ఉక్కుపాదం మోపండి ఉపకరణాలు, పందేల డబ్బును జప్తు చేయండి ఎక్కడ ఉల్లంఘనలు జరిగినా మీదే బాధ్యత జిల్లా కలెక్టర్లు, పోలీసు కమిషనర్లు, ఎస్పీలకు

కోడి పందేలపై ఉక్కుపాదం మోపండి ఉపకరణాలు, పందేల డబ్బును జప్తు చేయండి ఎక్కడ ఉల్లంఘనలు జరిగినా మీదే బాధ్యత జిల్లా కలెక్టర్లు, పోలీసు కమిషనర్లు, ఎస్పీలకు
January 11, 2026 06:07 PM 10 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

కోడి పందేలపై ఉక్కుపాదం మోపండి ఉపకరణాలు, పందేల డబ్బును జప్తు చేయండి ఎక్కడ ఉల్లంఘనలు జరిగినా మీదే బాధ్యత జిల్లా కలెక్టర్లు, పోలీసు కమిషనర్లు, ఎస్పీలకు హైకోర్టు ఆదేశం


అమరావతి, జనవరి 11 స్ధానికం న్యూస్ ఏపీ స్టేట్ బ్యూరో గడ్డం జగన్మోహన్ రెడ్డి సంక్రాంతి పండుగ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించే కోడి పందేలు, జూద కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపాలని హైకోర్టు ఆదేశించింది. ముఖ్యంగా తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో విస్తృతంగా కోడి పందేలు నిర్వహిస్తున్న నేపథ్యంలో జంతుహింస నిరోధక చట్టం 1960, ఏపీ జూద నిరోధక చట్టం 1974ను కఠినంగా అమలు చేయాలని అన్నీ జిల్లాల కలెక్టర్లు, పోలీసు కమిష నర్లు, ఎస్పీలను ఆదేశించింది. ఈ చట్టాలను పక్కాగా అమలు చేయాల్సిందేనని, ఎక్కడైనా ఉల్లంఘనలు జరిగితే అందుకు వ్యక్తిగతంగా మీరే బాధ్యత వహించాల్సి ఉంటుందని తేల్చి చెప్పింది. చట్టాల అమలులో విఫలమైన తహసీల్దార్లు, పోలీసు అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవచ్చని జిల్లా కలెక్టర్లు, పోలీసు కమిషనర్లు, జిల్లా ఎస్పీలకు స్పష్టం చేసింది. కోడి పందేల పేరుతో బెట్టింగ్, చట్ట వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహిస్తూ కోట్ల రూపాయలు, విలువ చేసే ఆస్తులను కోల్పోయే పరిస్థితి నెలకొందంటూ పలువురు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. కోడి పందేలను నియంత్రించాలని కోరుతూ వినతి పత్రాలు ఇచ్చినా కూడా పోలీసులు పట్టించు కోవడం లేదని పిటిషన్లలో పేర్కొన్నారు. ఆయా పిటిషన్లపై విచారణ సందర్భంగా పోలీసుల తరఫున ప్రభుత్వ న్యాయవాది (హోం) అడుసుమల్లి జయంతి వాదనలు వినిపించారు. వాదనల అనంతరం ఆయా జిల్లాల్లోని మండలాల్లో సంయుక్త తనిఖీ బృందాలను ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్లను న్యాయస్థానం ఆదేశించింది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News