Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రోడ్డు భద్రతకు గ్రామం ముందడుగు – హెల్మెట్ లేకుంటే ప్రవేశం లేదు.నిర్నెముల కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 12, 2026 08:23 AM

ఖేఢ్ సబ్ కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన:జీఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్ మచ్చేందర్

ఖేఢ్ సబ్ కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన:జీఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్ మచ్చేందర్

ఖేఢ్ సబ్ కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన:జీఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్ మచ్చేందర్
January 10, 2026 12:48 AM 134 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ స్థానిక ప్రతినిధి కృష్ణ:

నారాయణఖేడ్ పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ ఉమా హారతిని జీఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్, బిఆర్ఎస్ పార్టీ నాయకుడు గుఱ్ఱపు మచ్చేందర్ మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ భేటీలో నారాయణఖేడ్ నియోజకవర్గానికి సంబంధించిన పలు కీలక అంశాలపై విస్తృతంగా చర్చ జరిగింది. ముఖ్యంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, అలాగే ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో ప్రజలకు పూర్తిస్థాయిలో చేరుతున్నాయా లేదా అనే అంశాలపై సబ్ కలెక్టర్‌తో సమగ్రంగా చర్చించారు.ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలంటే అధికార యంత్రాంగం మరియు ప్రజాప్రతినిధుల మధ్య సమన్వయం అత్యంత అవసరమని మచ్చేందర్ పేర్కొన్నారు. అభివృద్ధి పనులు వేగవంతంగా పూర్తి కావాలంటే సంబంధిత శాఖల అధికారులు ప్రజాప్రతినిధులతో సమన్వయంగా పనిచేయాలని సూచించారు. అలాగే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు.ఈ సమావేశంలో రాష్ట్ర మాజీ ఆత్మ కమిటీ డైరెక్టర్ అనుముల మారుతి, ర్యాలమడుగు మాజీ ఎంపిటిసి అమ్ర్య నాయక్, నారాయణఖేడ్ మున్సిపల్ 4వ వార్డు బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు శ్రీకాంత్, సందుపట్ల రాములు, హన్మండ్లతో పాటు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News