ఖేఢ్ సబ్ కలెక్టర్ను మర్యాదపూర్వకంగా కలిసిన:జీఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్ మచ్చేందర్
ఖేఢ్ సబ్ కలెక్టర్ను మర్యాదపూర్వకంగా కలిసిన:జీఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్ మచ్చేందర్
Krishna
నారాయణఖేడ్ స్థానిక ప్రతినిధి కృష్ణ:
నారాయణఖేడ్ పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ ఉమా హారతిని జీఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్, బిఆర్ఎస్ పార్టీ నాయకుడు గుఱ్ఱపు మచ్చేందర్ మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ భేటీలో నారాయణఖేడ్ నియోజకవర్గానికి సంబంధించిన పలు కీలక అంశాలపై విస్తృతంగా చర్చ జరిగింది. ముఖ్యంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, అలాగే ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో ప్రజలకు పూర్తిస్థాయిలో చేరుతున్నాయా లేదా అనే అంశాలపై సబ్ కలెక్టర్తో సమగ్రంగా చర్చించారు.ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలంటే అధికార యంత్రాంగం మరియు ప్రజాప్రతినిధుల మధ్య సమన్వయం అత్యంత అవసరమని మచ్చేందర్ పేర్కొన్నారు. అభివృద్ధి పనులు వేగవంతంగా పూర్తి కావాలంటే సంబంధిత శాఖల అధికారులు ప్రజాప్రతినిధులతో సమన్వయంగా పనిచేయాలని సూచించారు. అలాగే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు.ఈ సమావేశంలో రాష్ట్ర మాజీ ఆత్మ కమిటీ డైరెక్టర్ అనుముల మారుతి, ర్యాలమడుగు మాజీ ఎంపిటిసి అమ్ర్య నాయక్, నారాయణఖేడ్ మున్సిపల్ 4వ వార్డు బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు శ్రీకాంత్, సందుపట్ల రాములు, హన్మండ్లతో పాటు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి