కేసీఆర్పై సిట్ విచారణకు నిరసన… రామన్నపేటలో బిఆర్ఎస్ ఆందోళన
కేసీఆర్పై సిట్ విచారణకు నిరసన… రామన్నపేటలో బిఆర్ఎస్ ఆందోళన
స్థానికం బృందం
రామన్నపేట మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. తెలంగాణ రాష్ట్ర సాధకుడు, తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ను సిట్ విచారణ పేరుతో ప్రభుత్వం పిలవడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని, రాజకీయ కక్షతోనే ఈ చర్యలు చేపడుతున్నారని బిఆర్ఎస్ నాయకులు తీవ్రంగా మండిపడ్డారు.కేసీఆర్ ప్రతిష్టను దెబ్బతీయాలనే ఉద్దేశంతోనే విచారణ కొనసాగిస్తున్నారని ఆరోపిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు. ప్రజల తీర్పుతో ఎన్నుకోబడిన నాయకుడిపై ఈ తరహా చర్యలు తగవని, ప్రజాస్వామ్య విలువలకు భంగం కలిగించే విధంగా ప్రభుత్వ వ్యవహారం ఉందని నాయకులు విమర్శించారు.
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు పోషబోయిన మల్లేశం, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బందెల రాములు, వివిధ గ్రామాల సర్పంచులు కూనూరి సాయికుమార్, పులిపలుపుల వీరస్వామి . మాజీ ఎంపీటీసీలు వేమవరం సుధీర్ బాబు, పున్న వెంకటేశం, ఎండి ఆమీర్, జిల్లా నాయకులు కన్నెబోయిన బలరాం, బద్దుల రమేష్, ఎస్ కే చాంద్ హాజరయ్యారు.పట్టణ కార్యదర్శి జాడ సంతోష్, యువజన విభాగం మండల అధ్యక్షుడు బత్తుల వెంకన్న, జనం పెళ్లి ఉపసర్పంచ్ చొప్పరి నరసింహతో పాటు మిరియాల మల్లేశం, గంగుల రాఘవరెడ్డి, నక్క నరేందర్, నల్ల సైదులు, నక్క రాములు, కూనూరి ముత్తయ్య బండ శ్రీనివాసరెడ్డి,బొడ్డుపల్లి రాజు, మధ్యపూరి ఐలయ్య, మేకల రాములు, ఆవుల శ్రీధర్, జాల అమరేందర్ రెడ్డి, నక్క రాంనర్సయ్య, మాండ్ర ఉపేందర్, నోముల గణేష్, కల్లూరి నరేష్, గట్టు శేఖర్, వంగాల సాయికుమార్, కొసని అంజయ్య, నారపాక రమేష్స,బోయిన బిక్షం, ఎర్రబోయిన గోపాల్, కోనేటి యాదయ్య, ఎర్రబోయిన సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి