Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గుడి బండలా మారిన గ్యాస్ బండి… క్యూలో నిల్చొని అలసిపోయిన వినియోగదారులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 10:50 AM

కాయకల్ప పీర్ అసెస్మెంట్ టీం దృష్టిలో రామన్నపేట ఏరియా ఆసుపత్రి… సేవలపై సంతృప్తి

కాయకల్ప పీర్ అసెస్మెంట్ టీం దృష్టిలో రామన్నపేట ఏరియా ఆసుపత్రి… సేవలపై సంతృప్తి

కాయకల్ప పీర్ అసెస్మెంట్ టీం దృష్టిలో రామన్నపేట ఏరియా ఆసుపత్రి… సేవలపై సంతృప్తి
February 13, 2026 04:27 PM 108 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట,

రామన్నపేట ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని శుక్రవారం కాయకల్ప పీర్ అసెస్మెంట్ టీం ఆకస్మికంగా పరిశీలించింది. శంకర్ నాయక్ నేతృత్వంలోని బృందం ఆసుపత్రిలోని వైద్య సేవలు, పారిశుధ్యం, నిర్వహణపై సమగ్ర సమీక్ష చేపట్టింది.

మొదటగా ఆసుపత్రి రికార్డులను పరిశీలించిన బృందం, రోగులకు అందిస్తున్న సేవలపై వైద్యులు, వైద్య సిబ్బందిని ప్రశ్నించి వివరాలు సేకరించింది. అనంతరం వార్డుల్లోకి వెళ్లి రోగులతో నేరుగా మాట్లాడి చికిత్స, మందుల లభ్యత, సిబ్బంది స్పందనపై అభిప్రాయాలు తెలుసుకుంది.ఆపరేషన్ థియేటర్, లేబర్ రూమ్, ఔట్ పేషంట్ విభాగం, ఆసుపత్రి పరిసరాల పరిశుభ్రతను ప్రత్యేకంగా పరిశీలించిన బృందం, మొత్తం నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. కాయకల్ప ప్రమాణాల ప్రకారం పారిశుధ్య నిర్వహణ, బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణ వంటి అంశాలపై కూడా సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆసుపత్రి సూపరిండెంట్ డా. శ్వేతా ప్రియాంక, సివిల్ సర్జన్ డా. పి. వీరన్న ఆధ్వర్యంలో బృంద సభ్యులను శాలువాలతో సన్మానించారు. వైద్యులు రాజగోపాల్, మాధవాచారి, శ్రీనివాస్, దేవేందర్, నవీన్ సింగ్, స్వాతి బాయి, వీణ, రజిని, వరుణ్ రెడ్డి, సుమంగళి, హెడ్ నర్సులు సువర్ణ, సోలి, జ్యోతి తదితర నర్సింగ్, పారామెడికల్ సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారు.

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News