కాయకల్ప పీర్ అసెస్మెంట్ టీం దృష్టిలో రామన్నపేట ఏరియా ఆసుపత్రి… సేవలపై సంతృప్తి
కాయకల్ప పీర్ అసెస్మెంట్ టీం దృష్టిలో రామన్నపేట ఏరియా ఆసుపత్రి… సేవలపై సంతృప్తి
స్థానికం బృందం
రామన్నపేట,
రామన్నపేట ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని శుక్రవారం కాయకల్ప పీర్ అసెస్మెంట్ టీం ఆకస్మికంగా పరిశీలించింది. శంకర్ నాయక్ నేతృత్వంలోని బృందం ఆసుపత్రిలోని వైద్య సేవలు, పారిశుధ్యం, నిర్వహణపై సమగ్ర సమీక్ష చేపట్టింది.
మొదటగా ఆసుపత్రి రికార్డులను పరిశీలించిన బృందం, రోగులకు అందిస్తున్న సేవలపై వైద్యులు, వైద్య సిబ్బందిని ప్రశ్నించి వివరాలు సేకరించింది. అనంతరం వార్డుల్లోకి వెళ్లి రోగులతో నేరుగా మాట్లాడి చికిత్స, మందుల లభ్యత, సిబ్బంది స్పందనపై అభిప్రాయాలు తెలుసుకుంది.ఆపరేషన్ థియేటర్, లేబర్ రూమ్, ఔట్ పేషంట్ విభాగం, ఆసుపత్రి పరిసరాల పరిశుభ్రతను ప్రత్యేకంగా పరిశీలించిన బృందం, మొత్తం నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. కాయకల్ప ప్రమాణాల ప్రకారం పారిశుధ్య నిర్వహణ, బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణ వంటి అంశాలపై కూడా సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆసుపత్రి సూపరిండెంట్ డా. శ్వేతా ప్రియాంక, సివిల్ సర్జన్ డా. పి. వీరన్న ఆధ్వర్యంలో బృంద సభ్యులను శాలువాలతో సన్మానించారు. వైద్యులు రాజగోపాల్, మాధవాచారి, శ్రీనివాస్, దేవేందర్, నవీన్ సింగ్, స్వాతి బాయి, వీణ, రజిని, వరుణ్ రెడ్డి, సుమంగళి, హెడ్ నర్సులు సువర్ణ, సోలి, జ్యోతి తదితర నర్సింగ్, పారామెడికల్ సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి