PRINT TIME: April 10, 2026 10:41 AM
కౌన్సిలర్ నిమ్మనగోటి శ్రీనివాస్కు కుమ్మర సంఘం ఘన సన్మానం
కౌన్సిలర్ నిమ్మనగోటి శ్రీనివాస్కు కుమ్మర సంఘం ఘన సన్మానం
February 19, 2026 06:23 AM
83 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
చిట్యాల మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్గా గెలుపొందిన నిమ్మనగోటి శ్రీనివాస్ను తెలంగాణ రాష్ట్ర కుమ్మర సంఘం రాష్ట్ర కోశాధికారి ఆమంచి రాజలింగం, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏరుకొండల వెంకటేశం, పలువురు కుమ్మర సంఘం నాయకులు శాలువాతో సన్మానించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజకీయాల్లో కుమ్మరులు మరింత ముందంజలో ఉండాల్సిన అవసరం ఉందని, సమాజ అభివృద్ధి కోసం శ్రీనివాస్ కృషి చేయాలని ఆకాంక్షించారు.
శ్రీనివాస్ మాట్లాడుతూ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ మున్సిపాలిటీ అభివృద్ధికి, ముఖ్యంగా కుమ్మరుల సంక్షేమానికి కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు కుమ్మర సంఘం నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి