PRINT TIME: April 13, 2026 11:32 PM
క్రికెట్ బెట్టింగ్పై కఠిన హెచ్చరికలు – పోలీసులు కౌన్సిలింగ్
క్రికెట్ బెట్టింగ్పై కఠిన హెచ్చరికలు – పోలీసులు కౌన్సిలింగ్
April 13, 2026 09:49 PM
6 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
ఆదోని వన్టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న వ్యక్తులను పోలీసులు స్టేషన్కు పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ పి. చంద్రశేఖర్ మాట్లాడుతూ, పోలీసుల ఆదేశాలను పట్టించుకోకుండా క్రికెట్ బెట్టింగ్ కొనసాగించినట్లయితే సంబంధిత వారిపై పీడీ చట్టం కింద కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే, బెట్టింగ్ ద్వారా సంపాదించిన ఆస్తులను జప్తు చేయడంతో పాటు వారి బ్యాంకు ఖాతాలను నిలిపివేస్తామని స్పష్టం చేశారు.
క్రికెట్ బెట్టింగ్ నిర్వహణకు ఎవరైనా సహకరించినా వారిపైనా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
చట్టవ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండి సమాజంలో శాంతి భద్రతలను కాపాడేందుకు సహకరించాలని ప్రజలకు పోలీసులు సూచించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి