Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ధాన్యం కొనుగోలు కేంద్రం పరిశీలించిన ఏఈఓ మురళి ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: April 10, 2026 12:55 AM

కర్రెగుట్టల్లో భారీ ఎన్‌కౌంటర్‌ ఐదుగురు మావోయిస్టులు మృతి..

కర్రెగుట్టల్లో భారీ ఎన్‌కౌంటర్‌ ఐదుగురు మావోయిస్టులు మృతి..

కర్రెగుట్టల్లో భారీ ఎన్‌కౌంటర్‌ ఐదుగురు మావోయిస్టులు మృతి..
February 20, 2026 12:24 PM 31 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

తెలంగాణ–ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దులోని కర్రెగుట్ట ప్రాంతంలో భద్రతా దళాలు, మావోయిస్టుల మధ్య జరిగిన భారీ ఎదురు కాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు అగ్రనేతలు హతమైనట్టు భద్రతా వర్గాలు భావిస్తున్నప్పటికీ, దీనిపై అధికారిక ధృవీకరణ ఇంకా వెలువడలేదు.

నిఘా వర్గాల సమాచారం మేరకు మావోయిస్టు కీలక నేత దేవ్‌జీ కర్రెగుట్ట ప్రాంతంలో ఉన్నారనే విశ్వసనీయ సమాచారం అందడంతో సుమారు ఐదు వేల మంది భద్రతా సిబ్బందిని అక్కడ మోహరించారు. మధ్యప్రదేశ్‌ వైపు నుంచి మావోయిస్టులు అడవుల్లోకి చొరబడ్డారనే సమాచారం నేపథ్యంలో కూంబింగ్‌ ఆపరేషన్‌ చేపట్టగా కాల్పులు చెలరేగాయి. ప్రస్తుతం కూడా కొన్ని ప్రాంతాల్లో ఎదురు కాల్పులు కొనసాగుతున్నట్టు తెలుస్తోంది.

దేశవ్యాప్తంగా మావోయిస్టు ప్రభావాన్ని నిర్మూలించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘ఆపరేషన్‌ కగార్‌’ గడువు సమీపిస్తున్న వేళ భద్రతా చర్యలు వేగవంతం అయ్యాయి. ఇప్పటికే వందలాది మంది మావోయిస్టులు మృతి చెందగా, వేలాది మంది వివిధ రాష్ట్ర ప్రభుత్వాల ఎదుట లొంగిపోయినట్టు అధికార వర్గాలు పేర్కొన్నాయి. పలువురిని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.

మరోవైపు మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులు దేహార్‌ మిశ్రా, దేవ్‌జీ, గణపతి సజీవంగా ఉన్నట్టు సమాచారం ఉన్నప్పటికీ తాజా ఘటనపై స్పష్టత రాలేదు. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ) కూడా కీలక నేతల కదలికలపై దృష్టి సారించింది. తాజా పరిస్థితులపై కేంద్ర హోం శాఖకు నివేదికలు పంపుతున్నట్లు తెలుస్తోంది.

కర్రెగుట్ట ప్రాంతంలో భద్రతా బలగాలు ముమ్మరంగా గాలింపు చర్యలు కొనసాగిస్తుండగా, పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News