కర్నూలు జిల్లా అధ్యక్షురాలి ప్రమాణ స్వీకారానికి ఆదోనినుంచి భారీగా తరలి వెళ్లిన నేతలు
కర్నూలు జిల్లా అధ్యక్షురాలి ప్రమాణ స్వీకారానికి ఆదోనినుంచి భారీగా తరలి వెళ్లిన నేతలు
Editor Desk
టిడిపి శక్తి ప్రదర్శన
కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలిగా గుడిసే ఆది కృష్ణమ్మ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆదోనినుంచి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున కర్నూలుకు బయలుదేరారు. ఆదోని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ మదిరే సూరం భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ తరలింపు జరిగింది.ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు. పార్టీ బలోపేతానికి ఈ కార్యక్రమం దోహదపడుతుందని నేతలు అభిప్రాయపడ్డారు. కర్నూలు జిల్లా రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీకి మరింత బలం చేకూర్చేలా ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం నిలవనుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ గోనెహళ్లి గోపాల్ రెడ్డి సహా పలువురు పార్టీ నేతలు పాల్గొన్నారు. నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివెళ్లడం పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపింది.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి