కర్ణాటకలో వివాహ వేడుకకు నాదెండ్ల బ్రహ్మం చౌదరి హాజరు
కర్ణాటకలో వివాహ వేడుకకు నాదెండ్ల బ్రహ్మం చౌదరి హాజరు
స్థానికం బృందం
అనంతరం మంత్రాలయంలో గురు రాఘవేంద్ర స్వామి దర్శనం
మాన్వి–సింధనూరు / మంత్రాలయం: కర్ణాటక రాష్ట్రంలోని మాన్వి–సింధనూరు వాస్తవ్యులు శ్రీ చాపరాల శ్రీనివాస్ కుమార్తె వివాహ వేడుకకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ చైర్మన్ నాదెండ్ల బ్రహ్మం చౌదరి హాజరయ్యారు. కార్యక్రమంలో కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్లు పోలీనెని సూర్యనారాయణ, సజ్జా అజయ్, తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి వెంకటేష్ చౌదరి పాల్గొన్నారు.
వివాహ వేడుక అనంతరం వారు మంత్రాలయం శ్రీ గురు రాఘవేంద్ర స్వామి మఠంను సందర్శించి శ్రీ గురు రాఘవేంద్ర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆలయ అధికారులు ఆశీర్వచనాలు అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రాలయం తెలుగుదేశం పార్టీ యువ నాయకులు, కౌతాళం మండల అధ్యక్షుడు సురేష్ నాయుడు, యువ నాయకుడు సతీష్ నాయుడు కార్పొరేషన్ చైర్మన్ మరియు డైరెక్టర్లను సన్మానించి, గురు రాఘవేంద్ర స్వామి వారి చిత్రపటాన్ని బహుకరించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి