Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 07:32 AM

కోసిగిలో టీడీపీకి బలం పెరుగుతోంది… వైసీపీ నుంచి భారీ చేరికలు

కోసిగిలో టీడీపీకి బలం పెరుగుతోంది… వైసీపీ నుంచి భారీ చేరికలు

కోసిగిలో టీడీపీకి బలం పెరుగుతోంది… వైసీపీ నుంచి భారీ చేరికలు
01-01-2026 63 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
స్థానికం ప్రతినిధి కుబేర

మంత్రాలయం టీడీపీ ఇంచార్జి ఎన్. రాఘవేంద్ర రెడ్డి నాయకత్వంలో కోసిగిలో మరోసారి రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. కోసిగి టౌన్‌ 1వ వార్డుకు చెందిన కురువ సోదరులు కురువ మల్లయ్య, కురువ వీరప్ప, కురువ ఈరన్న, కురువ వీరేష్‌తో పాటు మరో 20 కుటుంబాలకు చెందిన వైసీపీ కార్యకర్తలు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు.

రాఘవేంద్ర రెడ్డి నాయకత్వంపై నమ్మకంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని చేరికల సందర్భంగా కార్యకర్తలు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమం కోసిగి మండల నాయకులు ముత్తు రెడ్డి, మండల అధ్యక్షుడు పల్లెపాడు రామిరెడ్డి, సొసైటీ చైర్మన్ నాడిగిన అయ్యన్న సమక్షంలో జరిగింది.

ఈ సందర్భంగా రాఘవేంద్ర రెడ్డి మాట్లాడుతూ ప్రజావ్యతిరేక పాలనతో విసిగిపోయిన ప్రజలు అభివృద్ధి–సంక్షేమ పాలన వైపు మొగ్గుచూపుతున్నారని అన్నారు. టీడీపీ అంటే నమ్మకం, భవిష్యత్తు, అభివృద్ధి అనే భావన ప్రజల్లో బలంగా నెలకొంటోందని వ్యాఖ్యానించారు. కోసిగిలో పార్టీ బలం రోజురోజుకీ పెరుగుతోందని, ప్రజల ఆశలు–ఆశయాలకు టీడీపీ అండగా నిలుస్తుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో కోసిగి మండలానికి చెందిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Sthanikam

కోసిగిలో టీడీపీకి బలం పెరుగుతోంది… వైసీపీ నుంచి భారీ చేరికలు

Article Image
స్థానికం ప్రతినిధి కుబేర

మంత్రాలయం టీడీపీ ఇంచార్జి ఎన్. రాఘవేంద్ర రెడ్డి నాయకత్వంలో కోసిగిలో మరోసారి రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. కోసిగి టౌన్‌ 1వ వార్డుకు చెందిన కురువ సోదరులు కురువ మల్లయ్య, కురువ వీరప్ప, కురువ ఈరన్న, కురువ వీరేష్‌తో పాటు మరో 20 కుటుంబాలకు చెందిన వైసీపీ కార్యకర్తలు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు.

రాఘవేంద్ర రెడ్డి నాయకత్వంపై నమ్మకంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని చేరికల సందర్భంగా కార్యకర్తలు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమం కోసిగి మండల నాయకులు ముత్తు రెడ్డి, మండల అధ్యక్షుడు పల్లెపాడు రామిరెడ్డి, సొసైటీ చైర్మన్ నాడిగిన అయ్యన్న సమక్షంలో జరిగింది.

ఈ సందర్భంగా రాఘవేంద్ర రెడ్డి మాట్లాడుతూ ప్రజావ్యతిరేక పాలనతో విసిగిపోయిన ప్రజలు అభివృద్ధి–సంక్షేమ పాలన వైపు మొగ్గుచూపుతున్నారని అన్నారు. టీడీపీ అంటే నమ్మకం, భవిష్యత్తు, అభివృద్ధి అనే భావన ప్రజల్లో బలంగా నెలకొంటోందని వ్యాఖ్యానించారు. కోసిగిలో పార్టీ బలం రోజురోజుకీ పెరుగుతోందని, ప్రజల ఆశలు–ఆశయాలకు టీడీపీ అండగా నిలుస్తుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో కోసిగి మండలానికి చెందిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News