Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: February 24, 2026 03:21 AM

కోసిగిలో టీడీపీకి బలం పెరుగుతోంది… వైసీపీ నుంచి భారీ చేరికలు

కోసిగిలో టీడీపీకి బలం పెరుగుతోంది… వైసీపీ నుంచి భారీ చేరికలు

కోసిగిలో టీడీపీకి బలం పెరుగుతోంది… వైసీపీ నుంచి భారీ చేరికలు
January 01, 2026 05:52 PM 38 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
స్థానికం బృందం
స్థానికం ప్రతినిధి కుబేర

మంత్రాలయం టీడీపీ ఇంచార్జి ఎన్. రాఘవేంద్ర రెడ్డి నాయకత్వంలో కోసిగిలో మరోసారి రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. కోసిగి టౌన్‌ 1వ వార్డుకు చెందిన కురువ సోదరులు కురువ మల్లయ్య, కురువ వీరప్ప, కురువ ఈరన్న, కురువ వీరేష్‌తో పాటు మరో 20 కుటుంబాలకు చెందిన వైసీపీ కార్యకర్తలు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు.

రాఘవేంద్ర రెడ్డి నాయకత్వంపై నమ్మకంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని చేరికల సందర్భంగా కార్యకర్తలు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమం కోసిగి మండల నాయకులు ముత్తు రెడ్డి, మండల అధ్యక్షుడు పల్లెపాడు రామిరెడ్డి, సొసైటీ చైర్మన్ నాడిగిన అయ్యన్న సమక్షంలో జరిగింది.

ఈ సందర్భంగా రాఘవేంద్ర రెడ్డి మాట్లాడుతూ ప్రజావ్యతిరేక పాలనతో విసిగిపోయిన ప్రజలు అభివృద్ధి–సంక్షేమ పాలన వైపు మొగ్గుచూపుతున్నారని అన్నారు. టీడీపీ అంటే నమ్మకం, భవిష్యత్తు, అభివృద్ధి అనే భావన ప్రజల్లో బలంగా నెలకొంటోందని వ్యాఖ్యానించారు. కోసిగిలో పార్టీ బలం రోజురోజుకీ పెరుగుతోందని, ప్రజల ఆశలు–ఆశయాలకు టీడీపీ అండగా నిలుస్తుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో కోసిగి మండలానికి చెందిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News