Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాల్యవివాహాలు చట్టరీత్యా నేరం: సర్పంచ్ శాపాక లింగస్వామి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 06:03 PM

కోసిగిలో టీడీపీకి బలం పెరుగుతోంది… వైసీపీ నుంచి భారీ చేరికలు

కోసిగిలో టీడీపీకి బలం పెరుగుతోంది… వైసీపీ నుంచి భారీ చేరికలు

కోసిగిలో టీడీపీకి బలం పెరుగుతోంది… వైసీపీ నుంచి భారీ చేరికలు
January 01, 2026 05:52 PM 50 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
స్థానికం ప్రతినిధి కుబేర

మంత్రాలయం టీడీపీ ఇంచార్జి ఎన్. రాఘవేంద్ర రెడ్డి నాయకత్వంలో కోసిగిలో మరోసారి రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. కోసిగి టౌన్‌ 1వ వార్డుకు చెందిన కురువ సోదరులు కురువ మల్లయ్య, కురువ వీరప్ప, కురువ ఈరన్న, కురువ వీరేష్‌తో పాటు మరో 20 కుటుంబాలకు చెందిన వైసీపీ కార్యకర్తలు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు.

రాఘవేంద్ర రెడ్డి నాయకత్వంపై నమ్మకంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని చేరికల సందర్భంగా కార్యకర్తలు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమం కోసిగి మండల నాయకులు ముత్తు రెడ్డి, మండల అధ్యక్షుడు పల్లెపాడు రామిరెడ్డి, సొసైటీ చైర్మన్ నాడిగిన అయ్యన్న సమక్షంలో జరిగింది.

ఈ సందర్భంగా రాఘవేంద్ర రెడ్డి మాట్లాడుతూ ప్రజావ్యతిరేక పాలనతో విసిగిపోయిన ప్రజలు అభివృద్ధి–సంక్షేమ పాలన వైపు మొగ్గుచూపుతున్నారని అన్నారు. టీడీపీ అంటే నమ్మకం, భవిష్యత్తు, అభివృద్ధి అనే భావన ప్రజల్లో బలంగా నెలకొంటోందని వ్యాఖ్యానించారు. కోసిగిలో పార్టీ బలం రోజురోజుకీ పెరుగుతోందని, ప్రజల ఆశలు–ఆశయాలకు టీడీపీ అండగా నిలుస్తుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో కోసిగి మండలానికి చెందిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News