Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండ ప్రభుత్వ పాలిటెక్నిక్‌లోకి దారి తప్పి వచ్చిన జింక.. అప్రమత్తమైన అటవీశాఖ! నిజామాబాద్ లో ముగిసిన 108 సిబ్బంది ప్రత్యేక శిక్షణ తరగతులు లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 12, 2026 07:49 AM

కోసిగిలో పర్యటించిన ఆదోని జిల్లా సాధన సమితి జేఏసీ నాయకులు నూర్ అహ్మద్

కోసిగిలో పర్యటించిన ఆదోని జిల్లా సాధన సమితి జేఏసీ నాయకులు నూర్ అహ్మద్

కోసిగిలో పర్యటించిన ఆదోని జిల్లా సాధన సమితి జేఏసీ నాయకులు నూర్ అహ్మద్
January 01, 2026 08:27 PM 462 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
స్థానిక ప్రతినిధి

ఆదోని జిల్లా సాధన సమితి జేఏసీ కన్వీనర్ నూర్ అహ్మద్ కోసిగిలో పర్యటించడం జరిగింది. వారిని కోసిగి జేఏసీ నాయకులు సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్బంగా స్థానిక కోసిగి బస్టాండ్ ముందు ఆదోని జిల్లా సాధన పోస్టర్లను విడుదల చెయ్యడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆదోని జిల్లా కోసం సుమారుగా 50 రోజుల నుండి జిల్లా సాధనే లక్ష్యంగా ఆదోనికి సంబందించిన ఐదు నియోజకవర్గాలు ప్రజలు ఉద్యమం అమోఘమని, ఉద్యమాల ద్వారానే ప్రభుత్వం దృష్టికి ఆదోని జిల్లా వార్త చేరుకుందని వారు తెలిపారు. ఒకరి ఇద్దరితో మొదలైనటువంటి ఉద్యమం ఇప్పుడు లక్షల్లో ప్రజలు పాల్గొంటున్నారని వారు తెలిపారు.


ఉద్యమాలు మరింత ఉధృతం చేస్తే జిల్లా సాధన మరింత దగ్గర అవుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. కనుక ఈ ఉద్యమంలో కోసిగి నుండి కూడా అధిక సంఖ్యలో పాల్గొనాలని వారు పిలుపునిచ్చారు. కోసిగిలో జిల్లా సాధన కోసం జరిగే కార్యక్రమాలకు తమ మద్దతు ఉంటుందని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో కోసిగి జేఏసీ నాయకులు ఎం. రాజు, కోసిగయ్య, కరీం స్వామి, నాగేష్, ప్రతాప్, ప్రకాష్, రాము, గోపాల్, ఉషన్ బాషా తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News