Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: February 24, 2026 04:41 AM

కోసిగిలో పర్యటించిన ఆదోని జిల్లా సాధన సమితి జేఏసీ నాయకులు నూర్ అహ్మద్

కోసిగిలో పర్యటించిన ఆదోని జిల్లా సాధన సమితి జేఏసీ నాయకులు నూర్ అహ్మద్

కోసిగిలో పర్యటించిన ఆదోని జిల్లా సాధన సమితి జేఏసీ నాయకులు నూర్ అహ్మద్
January 01, 2026 08:27 PM 444 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
స్థానికం బృందం
స్థానిక ప్రతినిధి

ఆదోని జిల్లా సాధన సమితి జేఏసీ కన్వీనర్ నూర్ అహ్మద్ కోసిగిలో పర్యటించడం జరిగింది. వారిని కోసిగి జేఏసీ నాయకులు సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్బంగా స్థానిక కోసిగి బస్టాండ్ ముందు ఆదోని జిల్లా సాధన పోస్టర్లను విడుదల చెయ్యడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆదోని జిల్లా కోసం సుమారుగా 50 రోజుల నుండి జిల్లా సాధనే లక్ష్యంగా ఆదోనికి సంబందించిన ఐదు నియోజకవర్గాలు ప్రజలు ఉద్యమం అమోఘమని, ఉద్యమాల ద్వారానే ప్రభుత్వం దృష్టికి ఆదోని జిల్లా వార్త చేరుకుందని వారు తెలిపారు. ఒకరి ఇద్దరితో మొదలైనటువంటి ఉద్యమం ఇప్పుడు లక్షల్లో ప్రజలు పాల్గొంటున్నారని వారు తెలిపారు.


ఉద్యమాలు మరింత ఉధృతం చేస్తే జిల్లా సాధన మరింత దగ్గర అవుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. కనుక ఈ ఉద్యమంలో కోసిగి నుండి కూడా అధిక సంఖ్యలో పాల్గొనాలని వారు పిలుపునిచ్చారు. కోసిగిలో జిల్లా సాధన కోసం జరిగే కార్యక్రమాలకు తమ మద్దతు ఉంటుందని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో కోసిగి జేఏసీ నాయకులు ఎం. రాజు, కోసిగయ్య, కరీం స్వామి, నాగేష్, ప్రతాప్, ప్రకాష్, రాము, గోపాల్, ఉషన్ బాషా తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News