Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! బస్టాండ్‌ వద్ద ‘అండర్‌ పాస్‌’ నిర్మించాలి ​- ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి కౌన్సిలర్‌ వినతి ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 07:55 AM

కోసిగిలో పర్యటించిన ఆదోని జిల్లా సాధన సమితి జేఏసీ నాయకులు నూర్ అహ్మద్

కోసిగిలో పర్యటించిన ఆదోని జిల్లా సాధన సమితి జేఏసీ నాయకులు నూర్ అహ్మద్

కోసిగిలో పర్యటించిన ఆదోని జిల్లా సాధన సమితి జేఏసీ నాయకులు నూర్ అహ్మద్
January 01, 2026 08:27 PM 445 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
స్థానిక ప్రతినిధి

ఆదోని జిల్లా సాధన సమితి జేఏసీ కన్వీనర్ నూర్ అహ్మద్ కోసిగిలో పర్యటించడం జరిగింది. వారిని కోసిగి జేఏసీ నాయకులు సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్బంగా స్థానిక కోసిగి బస్టాండ్ ముందు ఆదోని జిల్లా సాధన పోస్టర్లను విడుదల చెయ్యడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆదోని జిల్లా కోసం సుమారుగా 50 రోజుల నుండి జిల్లా సాధనే లక్ష్యంగా ఆదోనికి సంబందించిన ఐదు నియోజకవర్గాలు ప్రజలు ఉద్యమం అమోఘమని, ఉద్యమాల ద్వారానే ప్రభుత్వం దృష్టికి ఆదోని జిల్లా వార్త చేరుకుందని వారు తెలిపారు. ఒకరి ఇద్దరితో మొదలైనటువంటి ఉద్యమం ఇప్పుడు లక్షల్లో ప్రజలు పాల్గొంటున్నారని వారు తెలిపారు.


ఉద్యమాలు మరింత ఉధృతం చేస్తే జిల్లా సాధన మరింత దగ్గర అవుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. కనుక ఈ ఉద్యమంలో కోసిగి నుండి కూడా అధిక సంఖ్యలో పాల్గొనాలని వారు పిలుపునిచ్చారు. కోసిగిలో జిల్లా సాధన కోసం జరిగే కార్యక్రమాలకు తమ మద్దతు ఉంటుందని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో కోసిగి జేఏసీ నాయకులు ఎం. రాజు, కోసిగయ్య, కరీం స్వామి, నాగేష్, ప్రతాప్, ప్రకాష్, రాము, గోపాల్, ఉషన్ బాషా తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News