Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
హోమియో ఆయుష్ డే సందర్భంగా యోగ అవగాహన కార్యక్రమం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 01:23 PM

కనగల్లులో నాగార్జున ప్రభుత్వ కళాశాల విద్యార్థుల శీతాకాల ప్రత్యేక శిబిరం ప్రారంభం

కనగల్లులో నాగార్జున ప్రభుత్వ కళాశాల విద్యార్థుల శీతాకాల ప్రత్యేక శిబిరం ప్రారంభం

కనగల్లులో నాగార్జున ప్రభుత్వ కళాశాల విద్యార్థుల శీతాకాల ప్రత్యేక శిబిరం ప్రారంభం
February 04, 2026 06:47 PM 17 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్లగొండ, ఫిబ్రవరి 4:

నాగార్జున ప్రభుత్వ కళాశాల, నల్లగొండ విద్యార్థినీ విద్యార్థులు నేషనల్ సర్వీస్ స్కీమ్ యూనిట్–3, యూనిట్–5 ఆధ్వర్యంలో కనగల్లు గ్రామంలో శీతాకాల ప్రత్యేక శిబిరాన్ని ప్రారంభించారు. గ్రామ ప్రజలకు పారిశుద్ధ్య కార్యక్రమాలు, అంటువ్యాధుల నివారణపై అవగాహన కల్పించాలనే లక్ష్యంతో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశారు.శిబిర ప్రారంభ సమావేశంలో గ్రామ సర్పంచ్ నర్సింగు మురళీధర్ గౌడ్ మాట్లాడుతూ, నాగార్జున ప్రభుత్వ కళాశాల విద్యార్థులు గ్రామానికి రావడం ఆనందకరమని తెలిపారు. గ్రామ ప్రజలను చైతన్యపరచేలా వివిధ సామాజిక కార్యక్రమాలపై అవగాహన కల్పించాలని విద్యార్థులను కోరారు.మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం నేషనల్ సర్వీస్ స్కీమ్ సమన్వయకర్త ఎం. వెంకటరమణారెడ్డి పాల్గొని, శిబిర లక్ష్యాలు, కార్యక్రమాలపై విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. విద్యార్థులు సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని గ్రామస్థులకు ఉపయోగపడే విధంగా పని చేయాలని సూచించారు.ఈ సందర్భంగా కళాశాల ఉపప్రాచార్యులు డాక్టర్ పి. రవికుమార్ మాట్లాడుతూ, గ్రామ ప్రజలకు సేంద్రియ వ్యవసాయంపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ డి. మునిస్వామి మాట్లాడుతూ, విద్యార్థులు ముందుండి సామాజిక కార్యక్రమాలు నిర్వహించి కళాశాలకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సృజన కుమారి కూడా సమావేశంలో విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు.ఈ శిబిరాన్ని నేషనల్ సర్వీస్ స్కీమ్ యూనిట్–3 కార్యక్రమ అధికారి డాక్టర్ అనిల్ కుమార్, యూనిట్–5 కార్యక్రమ అధికారి డాక్టర్ ఆదె మల్లేష్ ముందుండి నిర్వహించారు. కార్యక్రమంలో కనగల్లు గ్రామ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యులు డాక్టర్ రామకృష్ణ, ఉపసర్పంచ్ చంద్రయ్య, గ్రామ వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News