కనగల్లు గ్రామంలో ఎన్ఎస్ఎస్ శీతాకాల ప్రత్యేక శిబిరం ప్రారంభం
కనగల్లు గ్రామంలో ఎన్ఎస్ఎస్ శీతాకాల ప్రత్యేక శిబిరం ప్రారంభం
స్థానికం బృందం
నల్లగొండ జిల్లా కనగల్లు గ్రామంలో నాగార్జున ప్రభుత్వ కళాశాల విద్యార్థులు శీతాకాల ప్రత్యేక శిబిరాన్ని ప్రారంభించారు. నాగార్జున ప్రభుత్వ కళాశాల జాతీయ సేవా పథకం మూడవ, ఐదవ విభాగాల ఆధ్వర్యంలో ఈ శిబిరాన్ని నిర్వహిస్తున్నారు.గ్రామ ప్రజలకు పారిశుద్ధ్యంపై, అంటువ్యాధుల నివారణపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. శిబిర ప్రారంభ సమావేశంలో గ్రామ సర్పంచ్ నర్సింగు మురళీధర్ గౌడ్ మాట్లాడుతూ తమ గ్రామానికి కళాశాల విద్యార్థులు రావడం ఆనందంగా ఉందన్నారు. గ్రామ ప్రజలను చైతన్యపరిచే విధంగా సేవా కార్యక్రమాలు చేపట్టాలని విద్యార్థులను కోరారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయ జాతీయ సేవా పథకం సమన్వయకర్త వెంకటరమణారెడ్డి విద్యార్థులకు శిబిర లక్ష్యాలు, బాధ్యతలపై దిశానిర్దేశం చేశారు. విద్యార్థులు సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని గ్రామ ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.నాగార్జున ప్రభుత్వ కళాశాల ఉపాధ్యక్షుడు డాక్టర్ పి రవికుమార్ మాట్లాడుతూ గ్రామ ప్రజలకు సేంద్రీయ వ్యవసాయంపై అవగాహన అవసరమన్నారు. పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ డి మునిస్వామి మాట్లాడుతూ విద్యార్థులు ముందుండి సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించి కళాశాలకు మంచి పేరు తీసుకురావాలని తెలిపారు.జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సృజన కుమారి సమావేశంలో విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు.ఈ శిబిరాన్ని జాతీయ సేవా పథకం మూడవ విభాగం కార్యక్రమాధికారి డాక్టర్ అనిల్ కుమార్, ఐదవ విభాగం కార్యక్రమాధికారి డాక్టర్ ఆదె మల్లేష్ ముందుండి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కనగల్లు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యుడు రామకృష్ణ, గ్రామ ఉపసర్పంచ్ చంద్రయ్య, గ్రామ వార్డు సభ్యులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి