Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చేయూత పథకం కింద కొత్త పెన్షన్లు.. 31లోగా దరఖాస్తు చేసుకోవాలి:జిల్లా అదనపు కలెక్టర్ పాండు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 28, 2026 04:34 PM

కనగల్లు గ్రామంలో ఎన్ఎస్‌ఎస్ శీతాకాల ప్రత్యేక శిబిరం ప్రారంభం

కనగల్లు గ్రామంలో ఎన్ఎస్‌ఎస్ శీతాకాల ప్రత్యేక శిబిరం ప్రారంభం

కనగల్లు గ్రామంలో ఎన్ఎస్‌ఎస్ శీతాకాల ప్రత్యేక శిబిరం ప్రారంభం
04-02-2026 40 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్లగొండ జిల్లా కనగల్లు గ్రామంలో నాగార్జున ప్రభుత్వ కళాశాల విద్యార్థులు శీతాకాల ప్రత్యేక శిబిరాన్ని ప్రారంభించారు. నాగార్జున ప్రభుత్వ కళాశాల జాతీయ సేవా పథకం మూడవ, ఐదవ విభాగాల ఆధ్వర్యంలో ఈ శిబిరాన్ని నిర్వహిస్తున్నారు.గ్రామ ప్రజలకు పారిశుద్ధ్యంపై, అంటువ్యాధుల నివారణపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. శిబిర ప్రారంభ సమావేశంలో గ్రామ సర్పంచ్ నర్సింగు మురళీధర్ గౌడ్ మాట్లాడుతూ తమ గ్రామానికి కళాశాల విద్యార్థులు రావడం ఆనందంగా ఉందన్నారు. గ్రామ ప్రజలను చైతన్యపరిచే విధంగా సేవా కార్యక్రమాలు చేపట్టాలని విద్యార్థులను కోరారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయ జాతీయ సేవా పథకం సమన్వయకర్త వెంకటరమణారెడ్డి విద్యార్థులకు శిబిర లక్ష్యాలు, బాధ్యతలపై దిశానిర్దేశం చేశారు. విద్యార్థులు సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని గ్రామ ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.నాగార్జున ప్రభుత్వ కళాశాల ఉపాధ్యక్షుడు డాక్టర్ పి రవికుమార్ మాట్లాడుతూ గ్రామ ప్రజలకు సేంద్రీయ వ్యవసాయంపై అవగాహన అవసరమన్నారు. పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ డి మునిస్వామి మాట్లాడుతూ విద్యార్థులు ముందుండి సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించి కళాశాలకు మంచి పేరు తీసుకురావాలని తెలిపారు.జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సృజన కుమారి సమావేశంలో విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు.ఈ శిబిరాన్ని జాతీయ సేవా పథకం మూడవ విభాగం కార్యక్రమాధికారి డాక్టర్ అనిల్ కుమార్, ఐదవ విభాగం కార్యక్రమాధికారి డాక్టర్ ఆదె మల్లేష్ ముందుండి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కనగల్లు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యుడు రామకృష్ణ, గ్రామ ఉపసర్పంచ్ చంద్రయ్య, గ్రామ వార్డు సభ్యులు పాల్గొన్నారు.

Sthanikam

కనగల్లు గ్రామంలో ఎన్ఎస్‌ఎస్ శీతాకాల ప్రత్యేక శిబిరం ప్రారంభం

Article Image

నల్లగొండ జిల్లా కనగల్లు గ్రామంలో నాగార్జున ప్రభుత్వ కళాశాల విద్యార్థులు శీతాకాల ప్రత్యేక శిబిరాన్ని ప్రారంభించారు. నాగార్జున ప్రభుత్వ కళాశాల జాతీయ సేవా పథకం మూడవ, ఐదవ విభాగాల ఆధ్వర్యంలో ఈ శిబిరాన్ని నిర్వహిస్తున్నారు.గ్రామ ప్రజలకు పారిశుద్ధ్యంపై, అంటువ్యాధుల నివారణపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. శిబిర ప్రారంభ సమావేశంలో గ్రామ సర్పంచ్ నర్సింగు మురళీధర్ గౌడ్ మాట్లాడుతూ తమ గ్రామానికి కళాశాల విద్యార్థులు రావడం ఆనందంగా ఉందన్నారు. గ్రామ ప్రజలను చైతన్యపరిచే విధంగా సేవా కార్యక్రమాలు చేపట్టాలని విద్యార్థులను కోరారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయ జాతీయ సేవా పథకం సమన్వయకర్త వెంకటరమణారెడ్డి విద్యార్థులకు శిబిర లక్ష్యాలు, బాధ్యతలపై దిశానిర్దేశం చేశారు. విద్యార్థులు సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని గ్రామ ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.నాగార్జున ప్రభుత్వ కళాశాల ఉపాధ్యక్షుడు డాక్టర్ పి రవికుమార్ మాట్లాడుతూ గ్రామ ప్రజలకు సేంద్రీయ వ్యవసాయంపై అవగాహన అవసరమన్నారు. పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ డి మునిస్వామి మాట్లాడుతూ విద్యార్థులు ముందుండి సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించి కళాశాలకు మంచి పేరు తీసుకురావాలని తెలిపారు.జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సృజన కుమారి సమావేశంలో విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు.ఈ శిబిరాన్ని జాతీయ సేవా పథకం మూడవ విభాగం కార్యక్రమాధికారి డాక్టర్ అనిల్ కుమార్, ఐదవ విభాగం కార్యక్రమాధికారి డాక్టర్ ఆదె మల్లేష్ ముందుండి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కనగల్లు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యుడు రామకృష్ణ, గ్రామ ఉపసర్పంచ్ చంద్రయ్య, గ్రామ వార్డు సభ్యులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News