Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
హోమియో ఆయుష్ డే సందర్భంగా యోగ అవగాహన కార్యక్రమం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 01:26 PM

కాలనీవాసుల విజ్ఞప్తికి తక్షణ స్పందన. వార్డు సమస్యను తీర్చిన సర్పంచ్, వార్డు సభ్యులు

కాలనీవాసుల విజ్ఞప్తికి తక్షణ స్పందన. వార్డు సమస్యను తీర్చిన సర్పంచ్, వార్డు సభ్యులు

కాలనీవాసుల విజ్ఞప్తికి తక్షణ స్పందన. వార్డు సమస్యను తీర్చిన సర్పంచ్, వార్డు సభ్యులు
February 06, 2026 06:46 AM 31 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నిత్యం ప్రమాదాలకు కారణమవుతున్న ప్రాంతాన్ని తక్షణమే గుర్తించి, కాలనీవాసుల విజ్ఞప్తి మేరకు సమస్యను పరిష్కరించిన మాధవ ఎడవల్లి గ్రామ సర్పంచ్ కందకట్ల రజనీ యాదవ రెడ్డి, ఉపసర్పంచ్ పైళ్ల శ్రీనివాస్ రెడ్డి చర్యలు అభినందనీయమని గ్రామస్థులు ప్రశంసించారు.నార్కెట్‌పల్లి మండలంలోని మాధవ ఎడవల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని మొదటి వార్డులో మానస రెసిడెన్సీ వద్ద తరచూ ప్రమాదాలు జరుగుతుండటంతో కాలనీవాసులు ఈ సమస్యను సర్పంచ్, ఉపసర్పంచ్ దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే స్పందించిన ప్రజాప్రతినిధులు గురువారం ఆ ప్రాంతాన్ని పరిశీలించి, మట్టి పోయించి రహదారిని సమతలంగా చేయిస్తూ ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టారు.ఈ సందర్భంగా కాలనీవాసులు మాట్లాడుతూ, గ్రామ అభివృద్ధికి తాము కూడా భాగస్వాములమవుతూ పెండింగ్‌లో ఉన్న ఇంటి పన్నులను చెల్లిస్తామని హామీ ఇచ్చారు. అడిగిన వెంటనే స్పందించి తమ కాలనీ సమస్యను పరిష్కరించినందుకు సర్పంచ్ కందకట్ల రజనీ యాదవ రెడ్డి, ఉపసర్పంచ్ పైళ్ల శ్రీనివాస్ రెడ్డిలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో వార్డు సభ్యురాలు సామ మహేశ్వరి శాంతి రెడ్డి, కాలనీవాసులు శివకుమార్, కడారి శ్రీనివాస్, నర్సిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News