Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఇనుగుర్తి లో ఘనంగా రాఖీ పండుగ వేడుకలు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 28, 2026 08:32 PM

కాలనీవాసుల విజ్ఞప్తికి తక్షణ స్పందన. వార్డు సమస్యను తీర్చిన సర్పంచ్, వార్డు సభ్యులు

కాలనీవాసుల విజ్ఞప్తికి తక్షణ స్పందన. వార్డు సమస్యను తీర్చిన సర్పంచ్, వార్డు సభ్యులు

కాలనీవాసుల విజ్ఞప్తికి తక్షణ స్పందన. వార్డు సమస్యను తీర్చిన సర్పంచ్, వార్డు సభ్యులు
06-02-2026 48 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నిత్యం ప్రమాదాలకు కారణమవుతున్న ప్రాంతాన్ని తక్షణమే గుర్తించి, కాలనీవాసుల విజ్ఞప్తి మేరకు సమస్యను పరిష్కరించిన మాధవ ఎడవల్లి గ్రామ సర్పంచ్ కందకట్ల రజనీ యాదవ రెడ్డి, ఉపసర్పంచ్ పైళ్ల శ్రీనివాస్ రెడ్డి చర్యలు అభినందనీయమని గ్రామస్థులు ప్రశంసించారు.నార్కెట్‌పల్లి మండలంలోని మాధవ ఎడవల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని మొదటి వార్డులో మానస రెసిడెన్సీ వద్ద తరచూ ప్రమాదాలు జరుగుతుండటంతో కాలనీవాసులు ఈ సమస్యను సర్పంచ్, ఉపసర్పంచ్ దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే స్పందించిన ప్రజాప్రతినిధులు గురువారం ఆ ప్రాంతాన్ని పరిశీలించి, మట్టి పోయించి రహదారిని సమతలంగా చేయిస్తూ ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టారు.ఈ సందర్భంగా కాలనీవాసులు మాట్లాడుతూ, గ్రామ అభివృద్ధికి తాము కూడా భాగస్వాములమవుతూ పెండింగ్‌లో ఉన్న ఇంటి పన్నులను చెల్లిస్తామని హామీ ఇచ్చారు. అడిగిన వెంటనే స్పందించి తమ కాలనీ సమస్యను పరిష్కరించినందుకు సర్పంచ్ కందకట్ల రజనీ యాదవ రెడ్డి, ఉపసర్పంచ్ పైళ్ల శ్రీనివాస్ రెడ్డిలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో వార్డు సభ్యురాలు సామ మహేశ్వరి శాంతి రెడ్డి, కాలనీవాసులు శివకుమార్, కడారి శ్రీనివాస్, నర్సిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

కాలనీవాసుల విజ్ఞప్తికి తక్షణ స్పందన. వార్డు సమస్యను తీర్చిన సర్పంచ్, వార్డు సభ్యులు

Article Image

నిత్యం ప్రమాదాలకు కారణమవుతున్న ప్రాంతాన్ని తక్షణమే గుర్తించి, కాలనీవాసుల విజ్ఞప్తి మేరకు సమస్యను పరిష్కరించిన మాధవ ఎడవల్లి గ్రామ సర్పంచ్ కందకట్ల రజనీ యాదవ రెడ్డి, ఉపసర్పంచ్ పైళ్ల శ్రీనివాస్ రెడ్డి చర్యలు అభినందనీయమని గ్రామస్థులు ప్రశంసించారు.నార్కెట్‌పల్లి మండలంలోని మాధవ ఎడవల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని మొదటి వార్డులో మానస రెసిడెన్సీ వద్ద తరచూ ప్రమాదాలు జరుగుతుండటంతో కాలనీవాసులు ఈ సమస్యను సర్పంచ్, ఉపసర్పంచ్ దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే స్పందించిన ప్రజాప్రతినిధులు గురువారం ఆ ప్రాంతాన్ని పరిశీలించి, మట్టి పోయించి రహదారిని సమతలంగా చేయిస్తూ ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టారు.ఈ సందర్భంగా కాలనీవాసులు మాట్లాడుతూ, గ్రామ అభివృద్ధికి తాము కూడా భాగస్వాములమవుతూ పెండింగ్‌లో ఉన్న ఇంటి పన్నులను చెల్లిస్తామని హామీ ఇచ్చారు. అడిగిన వెంటనే స్పందించి తమ కాలనీ సమస్యను పరిష్కరించినందుకు సర్పంచ్ కందకట్ల రజనీ యాదవ రెడ్డి, ఉపసర్పంచ్ పైళ్ల శ్రీనివాస్ రెడ్డిలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో వార్డు సభ్యురాలు సామ మహేశ్వరి శాంతి రెడ్డి, కాలనీవాసులు శివకుమార్, కడారి శ్రీనివాస్, నర్సిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News