Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 04:39 AM

కాలనీవాసుల విజ్ఞప్తికి తక్షణ స్పందన. వార్డు సమస్యను తీర్చిన సర్పంచ్, వార్డు సభ్యులు

కాలనీవాసుల విజ్ఞప్తికి తక్షణ స్పందన. వార్డు సమస్యను తీర్చిన సర్పంచ్, వార్డు సభ్యులు

కాలనీవాసుల విజ్ఞప్తికి తక్షణ స్పందన. వార్డు సమస్యను తీర్చిన సర్పంచ్, వార్డు సభ్యులు
February 06, 2026 06:46 AM 36 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నిత్యం ప్రమాదాలకు కారణమవుతున్న ప్రాంతాన్ని తక్షణమే గుర్తించి, కాలనీవాసుల విజ్ఞప్తి మేరకు సమస్యను పరిష్కరించిన మాధవ ఎడవల్లి గ్రామ సర్పంచ్ కందకట్ల రజనీ యాదవ రెడ్డి, ఉపసర్పంచ్ పైళ్ల శ్రీనివాస్ రెడ్డి చర్యలు అభినందనీయమని గ్రామస్థులు ప్రశంసించారు.నార్కెట్‌పల్లి మండలంలోని మాధవ ఎడవల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని మొదటి వార్డులో మానస రెసిడెన్సీ వద్ద తరచూ ప్రమాదాలు జరుగుతుండటంతో కాలనీవాసులు ఈ సమస్యను సర్పంచ్, ఉపసర్పంచ్ దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే స్పందించిన ప్రజాప్రతినిధులు గురువారం ఆ ప్రాంతాన్ని పరిశీలించి, మట్టి పోయించి రహదారిని సమతలంగా చేయిస్తూ ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టారు.ఈ సందర్భంగా కాలనీవాసులు మాట్లాడుతూ, గ్రామ అభివృద్ధికి తాము కూడా భాగస్వాములమవుతూ పెండింగ్‌లో ఉన్న ఇంటి పన్నులను చెల్లిస్తామని హామీ ఇచ్చారు. అడిగిన వెంటనే స్పందించి తమ కాలనీ సమస్యను పరిష్కరించినందుకు సర్పంచ్ కందకట్ల రజనీ యాదవ రెడ్డి, ఉపసర్పంచ్ పైళ్ల శ్రీనివాస్ రెడ్డిలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో వార్డు సభ్యురాలు సామ మహేశ్వరి శాంతి రెడ్డి, కాలనీవాసులు శివకుమార్, కడారి శ్రీనివాస్, నర్సిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News